Ayodhya Ram Temple: ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో శ్రీరామ్ ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాముడు కొలువైన ఈ ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. గర్భగుడిపై కాషాయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఆలయ పనులు పూర్తి అయ్యాయని చెప్పడానికి గుర్తుగా ధ్వజారోహణం జరిగింది.
అయోధ్యలో వైభవంగా రామాలయం ధ్వజారోహణ
అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం పూర్తి అయ్యిందనే సంకేతంగా ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఉదయం 11.55 గంటలకు శుభ అభిజిత్ ముహూర్తం సమయంలో 10 నిమిషాల పాటు సాగింది. ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంయుక్తంగా ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఆవిష్కరించారు.
ఈ చారిత్రాత్మక ఘట్టం వేద పండితులు-మంత్రాల నడుమ భక్తుల జయ జయధ్వానాల మధ్య వైభవంగా సాగింది. అపూర్వమైన ఘట్టాన్ని దాదాపు 7 వేల మంది ప్రత్యక్షంగా తిలకించారు. ఇక ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ప్రధాని నరేంద్రమోదీ ఈ ధ్వజాన్ని ఎగురవేశారు. కాషాయ జెండా 22 అడుగుల పొడవు ఉంది.
శిఖరంపై కాషాయిపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
11 అడుగుల వెడల్పులో లంబకోణం మాదిరిగా ఉంది. ఆ జెండాపై శ్రీరాముడి తేజస్సు స్పష్టంగా కనిపించింది. అలాగే శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు వర్ణం దారంతో ఎంబ్రాయిడరీ చేశారు. ధ్వజారోహణ జరిగిన రోజు ఓ ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు.
ఇవాళ వివాహ పంచమి రోజున సీతారాముల కల్యాణం జరిగిందని, అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నట్లు వివరించారు. ఇలాంటి విశిష్టమైన రోజు ముఖ్యంగా అభిజిత్ లగ్నం సమయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. శ్రీరాముడి ఆలయంపై ఎగురువేసిన జెండాను అహ్మదాబాద్లో ఓ పారాచ్యూట్ సంస్థ తయారు చేసింది. సుదీర్ఘకాలం ఉండేలా పారాచ్యూట్ వస్త్రం, పట్టుదారాలతో రూపొందించారు. ఈ జెండా తయారీకి దాదాపు మూడువారాలు పైగానే శ్రమించి అందంగా తీర్చిదిద్దారు.
ALSO READ: గ్యాస్ ఛాంబర్ లా మారిపోయిన ఢిల్లీ, ఆపై కీలక నిర్ణయం
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఆ తర్వాత నగరంలో రోడ్ షో నిర్వహించారు. దారిలో ప్రజలు ప్రధానికి సాదరంగా ఆహ్వానించారు. మార్గం మధ్యలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.
టాప్ -10 పాయింట్లు ఒక్కసారి చూద్దాం.
1. సాధువులు, రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో ప్రధాని మోదీ 22 అడుగుల మతపరమైన జెండాను ఎగురవేసి ఆచారాలకు నాయకత్వం వహించారు. 500 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరింది.
2. అయోధ్య దాని చరిత్రలో మరో పురాతన ఘట్టాన్ని ఆవిష్కృతమైంది. దేశమంతా రాముని ధ్యానంలో మునిగిపోయింది.
3. లంబకోణ త్రిభుజాకార కాషాయ జెండా సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంది. శాశ్వత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం-జ్ఞానోదయం- శ్రీరాముడితో సంబంధం ఉన్న అన్ని లక్షణాలను సూచిస్తుంది.
4. ఓం చిహ్నంతో చెక్కబడిన జెండాను సాంప్రదాయ ఉత్తర భారత నగర నిర్మాణ శైలిలో నిర్మించిన శిఖర్ పై ఉంచారు.
5. ధ్వజారోహణ కార్యక్రమం రాముడు-సీత వివాహ పంచమి ముహూర్తంతో సమానంగా జరిగింది ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
6. 17వ శతాబ్దంలో అయోధ్యలో 48 గంటలు నిరంతరాయంగా ధ్యానం చేసిన తొమ్మిదవ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ బలిదానం చేసిన రోజు ఇవాళే.
7. కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి మార్గదర్శకత్వంలో అయోధ్య, కాశీ-దక్షిణ భారతదేశం నుండి వచ్చిన 108 మంది ఆచార్యులు ఈ ఆచారాలను నిర్వహించారు.
8. మధ్యాహ్నం 2.30 గంటల వరకు QR-కోడెడ్ పాస్లు ఉన్న ఆహ్వానిత అతిథులకు మాత్రమే ఆలయ ప్రవేశం.
9. అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి దాదాపు 6,000 మంది అతిథులను ఆహ్వానించింది ట్రస్ట్.
10. జనవరి 22న 2024న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టకు ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు సంవత్సరం తర్వాత ఆగస్టు 2020లో రామమందిరానికి శంకుస్థాపన జరిగింది.
ధర్మ ధ్వజాన్ని ఎగురవేసిన మోదీ
అయోధ్యలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం
అయోధ్య రామ మందిరంపై కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఆలయ పనులు పూర్తయ్యాయనడానికి గుర్తుగా ధ్వజారోహణం pic.twitter.com/dfNreQ1zd2
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2025