E-Paper
Advertisement

PM Modi: ‘భారత్ మండపం’.. మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ.. మూడో ఆర్థికశక్తిగా భారత్‌..

PM Modi: ‘భారత్ మండపం’.. మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ.. మూడో ఆర్థికశక్తిగా భారత్‌..
Advertisement
Bharat Mandapam Inauguration

Bharat Mandapam Inauguration(PM Modi news today in telugu): మూడోసారి కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తుంది.. ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంది.. అంటూ ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఊహించని రీతిలో మన దేశం ఎన్నో విజయాలు సాధిస్తోందని.. ఈ అభివృద్ధి ప్రయాణం ఆగదని అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (IECC)ను డ్రోన్‌తో హైటెక్‌గా ప్రారంభించారు పీఎం మోదీ. జీ-20 సమ్మిట్‌కు వేదిక కానున్న ఈ కన్వెన్షన్‌ సెంటర్‌కు ‘భారత్‌ మండపం’ (Bharat Mandapam) అని నామకరణం చేశారు.

ఢిల్లీలో 123 ఎకరాల విస్తీర్ణంలో.. దాదాపు 2,700 కోట్ల ఖర్చుతో.. హైటెక్ హంగులతో IECCను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్‌లో జరిగే జీ20 సదస్సుకు ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వనుంది. దేశ విదేశాలకు చెందిన 3వేల మందికి పైగా అతిథిలు హాజరుకానున్నారు. కొత్తగా నిర్మించిన ‘భారత్‌ మండపం’ మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు మోదీ.

Advertisement

ఇప్పటికే పార్లమెంట్ కొత్త భవనం గురించి భారతీయులంతా గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు ప్రధాని. పని చేసే విధానంతో పాటు పని వాతావరణాన్ని కూడా మార్చుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

PM-Modi-IECC

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×