Delhi: దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్ర్య సాధన లక్ష్యం కోసం జీవితమంతా త్యాగం చేశారని చెప్పుకొచ్చారు.
80వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రధానిగా ఆయన ఎర్రకోటపై జెండా ఎగురవేయడం 13వ సారి. ఎర్రకోటపై వందేమాతరం గీతాన్ని ఆలపించిన అనంతరం జాతీయజెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.