E-Paper
Advertisement

Radika Sarathkumar Nomination: నామినేషన్ దాఖలు చేసిన రాధికా శరత్ కుమార్.. ఆస్తులు రూ. 50 కోట్లపైనే..!

Radika Sarathkumar Nomination: నామినేషన్ దాఖలు చేసిన రాధికా శరత్ కుమార్.. ఆస్తులు రూ. 50 కోట్లపైనే..!
Advertisement
Radika Sarathkumar
Radika Sarathkumar

Radika Sarathkumar Filed her Nomination as a BJP MP Candidate: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశలో పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమిళనాడులో తొలి  విడతలోనే పోలింగ్ జరగనుంది.  దీంతో నామినేషన్ల సందడి మొదలైంది.

ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ బీజేపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె విరుదునగర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాధికా సమర్పించిన ఎన్నికల ఆఫిడవిట్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యారు. ఆమె తన ఆస్తుల విలువ 53 కోట్ల 45 లక్షల రూపాయులుగా పేర్కొన్నారు.

Advertisement

రాధికా శరత్ కుమార్ రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. తన వద్ద రూ.33 లక్షల నగదు ఉందని ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. 75 తులాల బంగారం, 5 కిలోల వెడి ఆభరణాలు ఉన్నాయని ప్రకటించారు. 27 కోట్ల రూపాయల చరాస్తులు, 26 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. దాదాపు 14 కోట్ల 79 లక్షల అప్పు ఉందని వివరాలు తెలిపారు.

Also Read: తీహార్ జైలుకు కవిత.. ఏప్రిల్ 9 వరకూ జ్యుడిషియల్ రిమాండ్

Advertisement

రాధిక భర్త సినీ నటుడు శరత్ కుమార్ గతంలో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పేరుతో పార్టీని స్థాపించారు. ఇటీవల ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలోనే రాధికాకు విరుదునగర్ లోక్ సభ సీటును కాషాయ పార్టీ ఇచ్చింది.

విరుదునగర్‌ లోక్ సభ స్థానంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ నుంచే దివంగత సినీ నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ కుమారుడు విజయ్ ప్రబాకరణ్ పోటీ చేస్తున్నారు. విజయ కాంత్ పార్టీ డీఎండీకేకు అన్నాడీఎంకేతో పొత్తు ఉంది. ఇప్పటికే విజయ్ ప్రభాకరన్ నామినేషన్ కూడా వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులను 17 కోట్ల 95 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. 11 కోట్లు 38 లక్షల చరాస్తులు, 6 కోట్ల 57 లక్షల స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. అప్పులను కోటీ 28 లక్షల రూపాయలుగా చూపించారు.

ఇప్పుడు విరుదునగర్ లో విజయం ఎవరిదనే అంశంగా హాట్ టాపిక్ గా మారింది.  రెండు సినీ కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ లో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×