BigTV English
Advertisement

Rahul Gandhi: ప్రధాని మోదీకి ఇక గడ్డుకాలమే: రాహుల్ గాంధీ

Rahul Gandhi: ప్రధాని మోదీకి ఇక గడ్డుకాలమే: రాహుల్ గాంధీ

భయంలో మోదీ
– ఇండియా కూటమితో మారిన ఈక్వేషన్స్
– ప్రధాని మోదీకి ఇక గడ్డుకాలమే
– జమ్మూ కశ్మీర్‌కు త్వరలోనే మంచిరోజులు
– ప్రజల హక్కులను పునరుద్ధరిస్తాం
– అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ


Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ కోల్పోయిన రాష్ట్ర హోదాను తిరిగి ఇప్పించి, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాట పట్టించటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. బుధవారం జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంబన్ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీరీయులు కోల్పోయిన హక్కులను తిరిగి వారికి ఇస్తామని స్పష్టం చేశారు. రాహుల్‌ ర్యాలీ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కూటమి గెలుపుతో..
ప్రధాని మోదీ తనను తాను ఓ దైవాంశ సంభూతుడిగా భావించుకుంటున్నారని, మిగిలిన సమాజంతో తానూ భాగమేననే వాస్తవాన్ని ఆయన అంగీకరించలేరని రాహుల్ విమర్శించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి సాధించిన విజయంతో ప్రధానికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. గతంలో బీసీ కులగణన అసాధ్యమని ప్రకటించిన మోదీ ఇప్పుడు దానిపై మాట మార్చారని, ఆర్ఎస్ఎస్ కూడా దీనిపై తన రూటు మార్చుకుందని గుర్తుచేశారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, చిరువ్యాపారులు, నిరుద్యోగులు ఈ సమాజంలో భాగం కానట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.


రాష్ట్రహోదా ఇచ్చి తీరతాం..
జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని అనాలోచితంగా, ఒంటెత్తు పోకడలతో మోదీ సర్కారు లాగేసుకుందని, దానిని పునరుద్ధరించి తీరతామని రాహుల్ హామీ ఇచ్చారు. 1947లో దేశంలోని జమీందారులు, రాజుల నుంచి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బదిలీ చేసిందని, 1950లో ఒక మంచి రాజ్యాంగాన్ని ప్రజలకు అందించిందని రాహుల్ గుర్తుచేశారు. కానీ, నేడు మోదీ పాలనలో జమ్ము కశ్మీర్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పేరుతో ఓ రాజు పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు.

Also Read: Amit shah: ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. ఏపీకి త్వరలోనే..

మూడు దశల్లో ఎన్నికలు
జమ్మూ కశ్మీర్‌లో సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు గానూ, కాంగ్రెస్ 32 స్థానాల్లో, నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో పొత్తుపై పోటీ చేయనున్నాయి. 5 స్థానాల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుంది. సీపీఎం, పాంథర్స్ పార్టీలకు చెరొక స్థానాన్ని ఎన్‌సీ వాటాలో కేటాయించారు. కాంగ్రెస్ ఇప్పటికే 9 మంది అభ్యర్ధులను ప్రకటించింది. ఈసారి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా సహా 40 మంది స్టార్ క్యాంపయినర్లు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించింది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Related News

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

Big Stories

×