BigTV English

Rahul Gandhi: ప్రస్తుత పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య: రాహుల్ గాంధీ

Rahul Gandhi: ప్రస్తుత పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు.. రెండు సిద్ధాంతాల మధ్య: రాహుల్ గాంధీ

Rahul GandhiRahul Gandhi(Politics news today India):భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సదర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ముంబయిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘జన్ న్యాయ్ పాదయాత్ర’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ, నటి స్వర భాస్కర్ తో పాటులో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. మణిపుర్‌లో మొదలైన ఈ భారత్ జోడో న్యాయ్ యాత్రను నేడు నిర్వహించిన భారీ ర్యాలీతో రాహుల్ గాంధీ ముంగిపు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.


రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం మోదీ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ఎంతో హడావుడి చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని సవరించాలనుకుంటే బీజేపీకి ఉభయ సభల్లో మూడోవంతు మెజార్టీ అవసరం అని.. అది బీజేపీకి లేదన్నారు. గతంలో బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్దే చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ తనదైన శైలిలో బదులిచ్చారు. ప్రజల మద్దతుతో పాటుగా సత్యం కూడా మనంవైపే ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదని.. రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికాన్ని ఓకే దగ్గర కేంద్రీకరించాలని భావిస్తుందన్నారు. రైతులు, కార్మికులకు జ్ఞానం లేదని బీజేపీ భావిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఓ వ్యక్తి ఐఐటీ డిగ్రీ పొందినంత మాత్రాన, అతడు రైతు కంటే ఎక్కువ తెలివైనవాడని కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

Also Read: Indian citizenship : పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం.. గుజరాత్‌లో పత్రాలు పంపిణీ..


అయితే ఈ యాత్ర ముగింపు సభలో నటి స్వర భాస్కర్ పాల్గొన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వర.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని రెండు భారత్ జోడో యాత్రలు ప్రశంసనీయమని కొనియాడారు. దేశంలో ప్రజలు రాహుల్ గాంధీని కలుసుకోవాలని.. వారితో మమేకం కావాలని కోరుకుంటున్నారని స్వర భాస్కర్ తెలిపారు. ఈమో 2022 డిసెంబర్ లో కూడా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×