E-Paper
Advertisement

Rare disease: హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి.. పాపం చిన్నారి మృతి.. బీ అలర్ట్!

Rare disease: హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి.. పాపం చిన్నారి మృతి.. బీ అలర్ట్!
Advertisement

Rare disease: చిన్నపాటి జ్వరం, తలనొప్పిగా మొదలైన వ్యాధి, క్షణాల్లో ప్రాణాల్ని బలి తీసుకుంది. వైద్యులు కూడా గుర్తించలేనంత వేగంగా వ్యాప్తి చెందిన ఈ అరుదైన ఇన్ఫెక్షన్ ఇప్పుడు ప్రజల్లో భయాందోళనలు రేపుతోంది. కలుషిత నీటిలో ఉండే ప్రమాదకరమైన సూక్ష్మజీవి కారణంగా వచ్చే ఈ వ్యాధి మరణ శాతం చాలా ఎక్కువ. ఇప్పటికే పలు కేసులు వెలుగుచూసిన ఈ రహస్యమైన వ్యాధి తాజాగా మరో చిన్నారి ప్రాణం తీసింది. దీంతో స్థానికులు ఆందోళనలో మునిగిపోగా, అధికారులు అప్రమత్తం అయ్యారు.

అరుదైన వ్యాధులు ఒకటి తర్వాత ఒకటి బయటపడుతున్న కేరళలో ఇప్పుడు కొత్త భయం అలుముకుంది. కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారి మూడు రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం స్థానికులను మాత్రమే కాదు, వైద్యులను కూడా షాక్‌కు గురిచేసింది. జ్వరం, తలనొప్పి లాంటి సాధారణ లక్షణాలతో ప్రారంభమైన ఈ వ్యాధి చివరికి చిన్నారిని బలి తీసుకోవడం తల్లిదండ్రులకు భరించలేని విషాదం. ముఖ్యంగా ఈ వ్యాధికి కారణమని చెబుతున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా పేరే వింటే ప్రజలు భయపడిపోతున్నారు.

Advertisement

అరుదైన వ్యాధి.. అమీబిక్ ఎన్‌కెఫలిటిస్
కేరళ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన ప్రకారం.. చిన్నారి మరణానికి కారణం అమీబిక్ ఎన్‌కెఫలిటిస్. కలుషిత నీటిలో ఉండే ఒక ప్రత్యేకమైన అమీబా మానవ శరీరంలోకి ప్రవేశించి మెదడును దాడి చేస్తుంది. దీన్ని వైద్యులు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. ఇది చాలా అరుదైనదే అయినా, ఒకసారి సోకితే ప్రాణాంతకమని చెబుతున్నారు.

లక్షణాలు ఎలా మొదలయ్యాయి?
కోజికోడ్ జిల్లా తమరస్సేరీకి చెందిన బాలికకు ఆగస్ట్ 13న జ్వరం, తీవ్ర తలనొప్పి వచ్చింది. మొదట సాధారణ జ్వరం అనుకుని కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో మరుసటి రోజు కోజికోడ్ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా, అదే రోజు చిన్నారి మరణించింది. మైక్రోబయాలజీ పరీక్షల్లో ఈ అరుదైన అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ కారణమేనని తేలింది.

Advertisement

జిల్లాలో ఇదే నాలుగో కేసు!
ఈ సంవత్సరం కోజికోడ్ జిల్లాలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. వాటిలో తాజాగా ఈ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల్లో అవగాహన పెంచకపోతే, మరింత మంది ఈ వ్యాధికి బలి కావాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వ్యాధి ఎలా సోకుతుంది?
వైద్య నిపుణుల వివరాల ప్రకారం.. ఈ అమీబా ఎక్కువగా చెరువులు, కాలువలు, కలుషిత నీటిలో ఉంటుంది. ఆ నీటిలో స్నానం చేయడం, ఈత కొట్టడం లేదా తలకడిగేటప్పుడు నీరు ముక్కు ద్వారా లోపలికి వెళ్లడం వలన మెదడును చేరి దాడి చేస్తుంది. ఒకసారి మెదడులోకి ప్రవేశించిన తర్వాత వేగంగా వ్యాధి పెరిగి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది.

Also Read: MLA Daggubati Prasad: ఆ ఆడియో నాది కాదు.. కానీ సారీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!

అధికారులు కదిలిన చర్యలు
చిన్నారి మృతి నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు ఆ ప్రాంతంలో విస్తృత పరిశీలనలు ప్రారంభించారు. ముఖ్యంగా ఆమె నివాసం వద్ద ఉన్న నీటి కాలువలు, చెరువులు, బోర్లు అన్నింటినీ పరీక్షిస్తున్నారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, కలుషిత నీటిలో ఈతలు లేదా స్నానాలు చేయవద్దని సూచనలు జారీ చేశారు.

ప్రజల్లో భయాందోళన
ఈ ఘటనతో కోజికోడ్ జిల్లా ప్రజల్లో భయాందోళన పెరిగింది. సాధారణంగా కేరళలో వర్షాకాలం కారణంగా నీటి నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఇలాంటి వ్యాధుల ముప్పు ఎక్కువ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి అరుదైనదే అయినప్పటికీ, ఒకసారి సోకితే తప్పించుకోవడం కష్టమని వైద్య నిపుణుల హెచ్చరికలు ప్రజల్లో కలవరాన్ని రేపుతున్నాయి.

ప్రజలకు వైద్యుల సూచనలు
కలుషిత నీటిలో ఈతలు, స్నానాలు చేయకూడదు. తాగునీటిని మరిగించి తాగాలి. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలి.

చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్న ఈ అరుదైన వ్యాధి కేరళలో మళ్లీ తలెత్తడం ఆందోళనకర విషయం. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని పేరు పెట్టుకున్న ఈ సూక్ష్మజీవి ప్రజలలో భయాన్ని కలిగిస్తున్నా.. జాగ్రత్తలు పాటిస్తే తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి మరణాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×