E-Paper
Advertisement

Red fort Attack Case: ఎర్ర కోటపై దాడి కేసు.. పాక్ టెర్రరిస్ట్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి..!

Red fort Attack Case: ఎర్ర కోటపై దాడి కేసు.. పాక్ టెర్రరిస్ట్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి..!
Advertisement

President Draupadi Murmu Rejected Mercy Petition of Pakistan Terrorist: దాదాపు 24 ఏళ్ల నాటి ఎర్రకోట దాడి కేసులో దోషిగా తేలిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు బుధవారం (జూన్ 12) ఒక ఉన్నతాధికారి తెలిపారు. జూలై 25, 2022న పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి తిరస్కరించిన రెండవ క్షమాభిక్ష పిటిషన్ ఇది.

నవంబర్ 3, 2022న, సుప్రీంకోర్టు ఆరిఫ్ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో అతనికి విధించిన మరణశిక్షను సమర్థించింది. అయితే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుదీర్ఘ జాప్యం కారణంగా మరణశిక్ష విధించిన దోషి తన శిక్షను మార్చాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానం తలుపులు తట్టవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

రాష్ట్రపతి ముర్ము మే 15న పాక్ టెర్రరిస్ట్ ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్‌ను స్వీకరించారు. ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ను మే 27న రాష్ట్రపతి తిరస్కరించినట్లు.. సెక్రటేరియట్ ఆర్డర్‌ను ఉటంకిస్తూ అధికారులు మే 29న తెలిపారు.

Also Read: భారత్‌లోని పేదలు, వయనాడ్ ప్రజలు.. వీరే నా దేవుళ్లు: రాహుల్ గాంధీ

Advertisement

అయితే ఉరిశిక్షను సమర్థిస్తూ సుప్రీంకోర్టు, ఆరిఫ్‌కు అనుకూలంగా ఎటువంటి ఉపశమన పరిస్థితులు లేవని పేర్కొంది. ఎర్రకోటపై దాడి దేశ ఐక్యత, సమగ్రత సార్వభౌమాధికారానికి ప్రత్యక్ష ముప్పుగా ఉందని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది.

డిసెంబరు 22, 2000న జరిగిన ఈ దాడిలో ఎర్రకోట ప్రాంగణంలో ఉన్న 7 రాజ్‌పుతానా రైఫిల్స్ యూనిట్‌పై చొరబాటుదారులు కాల్పులు జరిపారు. ఫలితంగా ముగ్గురు ఆర్మీ సిబ్బంది మరణించారు. పాకిస్తాన్ జాతీయుడు, నిషేధిత లష్కరే తోయిబా సభ్యుడు ఆరిఫ్‌ను దాడి జరిగిన నాలుగు రోజుల తరువాత ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×