E-Paper
Advertisement

Putin call to PM Modi: ఇండియా- పాకిస్థాన్ వార్.. రష్యా మద్దతు ఎవరికంటే?

Putin call to PM Modi: ఇండియా- పాకిస్థాన్ వార్.. రష్యా మద్దతు ఎవరికంటే?
Advertisement

Putin call to PM Modi: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతదేశానికి చాలా దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా కూడా మన దేశానికి సపోర్టుగా నిలుస్తోంది. రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వీరు ఇరువురు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం అంతం చేయడానికి తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పుతిన్ పేర్కొన్నారు.

పహల్గామ్ లో జరిగి ఉగ్ర దాడిలో అమాయక టూరిస్టులు మృతి చెందడం పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం అంతమొందించడానికి భారత్ చేస్తున్న పోరాటానికి రష్యా పూర్తి మద్దతుగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఈ పిరికిపంద దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను కూడా ఎక్కడున్నా పట్టుకుని కటినంగా శిక్షించాలని పుతిన్ స్పష్టం చేశారు.

Advertisement

పహల్గామ్ ఉగ్రదాడిని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర స్థాయిలో ఖండించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధార్ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 27 మంది అమాయక టూరిస్టుల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన ఉగ్రవాదంపై పోరులో భారత్ కు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాని వెల్లడించారు.

Also Read: MED Notification: ఆ జిల్లా వారికి సువర్ణవకాశం.. ఎలాంటి ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ జాబ్, జీతం రూ.32,670

Advertisement

కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిపై చర్చలతో పాటు భారత్ – రష్యా ప్రత్యేక సంబంధాల గురించి కూడా మాట్లాడుకున్నట్టు ఆయన తెలిపారు. అలాగే అద్భుతమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత కట్టుదిట్టంగా, బలోపేతంగా చేసేందుకు ఇరువురు నేతలు తన నిబద్ధతను పునరుద్ఘాటించారని జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగానే రష్యా విక్టరీ డే 80వ వార్షికోత్సవం సందర్భంలగా వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోదీ విషెస్ తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం చివరలో భారతదేశంలో జరిగే వార్షిక సదస్సుకు తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించారు.

ఇక గత నెల ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గామ్ లో దారుణ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 27 మంది మృతిచెందారు. ఈ క్రమంలోనే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు పూర్తి మద్దతు తెలుపుతూ.. ప్రధాని మోదీ కాల్ చేశారు. ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్, దాయాది దేశం పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తూనే ఉన్నాయి. ఈ దాడి జరిగిన తర్వాత పాక్ పై మన దేశం రాజకీయ, దౌత్యపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు పూర్తి మద్ధతు వస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Indian Military Academy: గుడ్‌న్యూస్.. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×