BigTV English

Sukesh Chandrasekhar: ‘వయనాడ్ బాధితుల కోసం 15 కోట్ల సాయం చేస్తా’.. కేరళ సిఎంకు ఆఫర్ చేసిన జైలు ఖైదీ!

Sukesh Chandrasekhar: ‘వయనాడ్ బాధితుల కోసం 15 కోట్ల సాయం చేస్తా’.. కేరళ సిఎంకు ఆఫర్ చేసిన జైలు ఖైదీ!

Sukesh Chandrasekhar news today(Live tv news telugu): జైలులో ఖైదీగా ఉన్న సెలిబ్రిటీ మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఓ లేఖ రాశాడు. వయనాడ్ లో ప్రకృతి వైపరీత్యానికి గురైన బాధితులను ఆదుకోవడానికి తన వంతు సాయంగా రూ.15 కోట్లు సిఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తానని లేఖలో పేర్కొన్నాడు.


సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు. పలువురు రాష్ట్ర మంత్రులు, బాలీవుడ్ సినీతారలతో సన్నిహిత సంబంధాలున్న ఈ కేటుగాడు గత కొన్ని సంవత్సరాలు జైలులో ఉంటూనే మీడియాలో పబ్లిసిటీ పొందేందుకు ఇలాంటి లేఖలు గతంలోనూ రాశాడు. అయితే కొన్నిసార్లు ఆ లేఖలు తను రాయలేదని మాటకూడా మార్చాడు.

అయితే ఈ సారి కేరళ సిఎంకు సుకేశ్ చంద్రశేఖర్ స్వయంగా లేఖ రాశాడని అతని లాయర్ అనంత్ మాలిక్ స్పష్టం చేశాడు. ఆ లేఖ ప్రకారం.. వయనాడ్ లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు 300 ఇళ్లు నిర్మించేందుకు ఆర్థిక సాయం అందిస్తానని తెలిపాడు.


“ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతుగా రూ.15 కోట్లు అందిస్తాను. దయచేసి వాటిని స్వీకరించండి. ఈ రూ. 15 కోట్లకు అదనంగా వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి 300 ఇళ్లు నిర్మించేందుకు వెంటనే మరింత ఆర్థిక సాయం చేస్తాను,” అని లేఖలో సుకేశ్ పేర్కొన్నాడు. తాను ఇచ్చే ధనమంతా చట్టపరంగా సంపాదించినదేనని, ఆ ధనాన్ని వయనాడ్ అభివృద్ధి, పునర్నిమాణ పనుల కోసం వినియోగించమని కోరాడు.

Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

అయితే సుకేశ్ లేఖపై కేరళ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. వయనాడ్ లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడడంతో వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న చాలామంది ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. దాదాపు 400 మంది చనిపోగా.. 138 మంది ఆచూకీ తెలియలేదు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

 

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×