E-Paper
Advertisement

Kejriwal Supreme court: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు.. విచారణ వాయిదా

Kejriwal Supreme court: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు.. విచారణ వాయిదా
Advertisement

Kejriwal Supreme court| ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఢిల్లీ మద్యం పాలసీ అవినీతి కేసులో బుధవారం కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం సిబిఐ అధికారులకు నోటీసులు జారీ చేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని.. సిబిఐకి నోటీసులు మాత్రమే జారీ చేస్తామని కేజ్రీవాల్ లాయర్ అభిషేక్ మను సింఘ్వికి చెప్పింది.

కేజ్రీవాల్ పిటీషన్ పై స్పందించాలని కేంద్ర విచారణ ఏజెన్సీ సిబిఐకి నోటీసులు జారీచేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో తనను చట్టవ్యతిరేకంగా అరెస్టు చేశారని సిబిఐ అధికారులపై కేజ్రీవాల్ పిటీషన్ వేశారు. కానీ ఆయన అరెస్ట్ లో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని హైకోర్టు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. దీంతో కేజ్రీవాల్ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.

Advertisement

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

బుధవారం కేజ్రీవాల్ విచారణ చేప్పట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణని ఆగస్టు 23వ తేదికి వాయిదా వేసింది.

Advertisement

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

ఢిల్లీ ప్రభుత్వం 2022లో కొత్త మద్యం పాలసీ నియమాలు రూపొందించడంలో అవినీతి పాల్పడ్డారనే అరోపణలు రావడంతో.. ఢిల్లీ గవర్నర్ సిబిఐకి విచారణ చేయాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 17 నెలలు జైలులో ఉన్న తరువాత సుప్రీం కోర్టు ద్వారా బెయిల్ పొందారు. ఈ కేసులో మరో నిందితురాలు తెలంగాణ బిఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు కె కవిత కూడా జైల్లోనే ఉన్నారు.

Also Read: హిండెన్‌బర్గ్ Vs సెబీ చీఫ్‌.. ఛాలెంజ్‌పై మాదభి మాటేంటి?

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×