BigTV English
Advertisement

Kejriwal Supreme court: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు.. విచారణ వాయిదా

Kejriwal Supreme court: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు.. విచారణ వాయిదా

Kejriwal Supreme court| ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఢిల్లీ మద్యం పాలసీ అవినీతి కేసులో బుధవారం కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం సిబిఐ అధికారులకు నోటీసులు జారీ చేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని.. సిబిఐకి నోటీసులు మాత్రమే జారీ చేస్తామని కేజ్రీవాల్ లాయర్ అభిషేక్ మను సింఘ్వికి చెప్పింది.


కేజ్రీవాల్ పిటీషన్ పై స్పందించాలని కేంద్ర విచారణ ఏజెన్సీ సిబిఐకి నోటీసులు జారీచేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో తనను చట్టవ్యతిరేకంగా అరెస్టు చేశారని సిబిఐ అధికారులపై కేజ్రీవాల్ పిటీషన్ వేశారు. కానీ ఆయన అరెస్ట్ లో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని హైకోర్టు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. దీంతో కేజ్రీవాల్ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్


బుధవారం కేజ్రీవాల్ విచారణ చేప్పట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణని ఆగస్టు 23వ తేదికి వాయిదా వేసింది.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

ఢిల్లీ ప్రభుత్వం 2022లో కొత్త మద్యం పాలసీ నియమాలు రూపొందించడంలో అవినీతి పాల్పడ్డారనే అరోపణలు రావడంతో.. ఢిల్లీ గవర్నర్ సిబిఐకి విచారణ చేయాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 17 నెలలు జైలులో ఉన్న తరువాత సుప్రీం కోర్టు ద్వారా బెయిల్ పొందారు. ఈ కేసులో మరో నిందితురాలు తెలంగాణ బిఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు కె కవిత కూడా జైల్లోనే ఉన్నారు.

Also Read: హిండెన్‌బర్గ్ Vs సెబీ చీఫ్‌.. ఛాలెంజ్‌పై మాదభి మాటేంటి?

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×