BigTV English

Delhi Pollution Supreme Court: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్!

Delhi Pollution Supreme Court: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్!

Delhi Pollution Supreme Court| దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా చలికాలంలో ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ దారుణ స్థితికి పడిపోతున్నాయి. ఈ సమస్యపై సుప్రీం కోర్టు బుధవారం సీరియస్ అయింది. రాజధానిలో గాలి కాలుష్యానికి ముఖ్యకారణం హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వమే నిర్లక్ష్యమని మండిపడింది.


ఇంత తీవ్ర సమస్య ఉంటే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా?.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతారా? అని దేశ అత్యున్నత ఢిల్లీ పొరుగు రాష్ట్రాల తీరును ఎండగట్టింది. పంజాబ్ లోని రైతులు పంట ఎండు గడ్డి (మొద్దు)ని కాల్చడం వల్ల తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ నిపుణులు చెబుతున్నా.. ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవలేదో? అర్థం కావడం లేదని సుప్రీం కోర్టు త్రిసభ్యధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Also Read: నకిలీ వేల్ షార్క్ చూపించి కోట్లు సంపాదించిన చైనా కంపెనీ.. ఎలా గుర్తుపట్టారంటే


ముగ్గురు న్యాయమూర్తులు.. జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎ జి మసీహ్, జస్టిస్ అభయ్ ఎస్. ఓకా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హర్యాణా, పంజాబ్ రాష్ట్రాలలోని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సిఎక్యూఎం) అధికారులని ఢిల్లీ వాయు కాలుష్యానికి బాధ్యులుగా చేసింది. ”హర్యాణా, పంజాబ్ రాష్ట్రాలలో పంట ఎండు గడ్డి కాల్చడంపై నిషేధం ఉన్నా రైతులు నియమాలను పాటించకపోతే వారిని ఎందుకు శిక్షించలేదు? హర్యాణాలో అయితే 2021 నుంచి ఇప్పటి వరకు కేవలం 200 మందిపై నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. అది కూడా ఏదో చిన్న ఫైన్ విధించి చేతులు దులుపుకున్నారు.

అసలు అధికారులు పనిచేస్తున్నారా?. హర్యాణా, పంజాబ్ ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలు పాటించవా?.. పాటించకపోతే తాము ఏమీ చేయలేమని చెప్పాలి? ఆ తరువాత మేము చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో చీఫ్ సెక్రటరీలపై ఎవరైనా రాజకీయ ఒత్తిడి చేస్తుంటే.. మాకు తెలియజేయాలి. వారికి కూడా కోర్టు సమన్లు జారీ చేస్తుంది. వాయు కాలష్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో? పంజాబ్, హర్యాణా చీఫ్ సెక్రటరీలు సమాధానం చెప్పాలి. ఇద్దరూ వారం రోజుల తరువాత కోర్టులో స్వయంగా హాజరుకావాలి.” అని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం వాయు కాలుష్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కోర్టు విచారణ సమయంలో ప్రభుత్వం తరుపున వాదించే పంజాబ్ అడ్వకేట్ జెనెరల్ కు న్యాయమూర్తల కోపంతో చెమటలు పట్టాయి. 2013లో పంజాబ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షన చట్టం తీసుకువచ్చింది. కానీ దాని అమలు ఏమాత్రం లేదని సుప్రీం కోర్టు గమనించింది. విచారణ మధ్యలో పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది తమకు ఎండు గట్టి కాల్చే లొకేషన్ తెలుసుకునేందకు ఆలస్యం జరగుతోందని చెప్పగా.. న్యాయమూర్తులు మరింత ఆగ్రహం చూపించారు. భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాటిలైట్లు పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలకు పొగ వచ్చే లొకేషన్ గుర్తించి వెంటనే సమాచారం అందిస్తోందని.. ఈ విషయం రికార్డుల్లో ఉన్నా.. కోర్టును మధ్య పెట్టేందుకు చూస్తారా? అని అడ్వకేట్ జెనెరల్ కు చురకలు అంటించారు.

ఢిల్లీలో దసరా తరువాత వాయు కాలుష్యం పెరిగిపోయింది. పైగా త్వరలో దీపావళి రానుంది. ఈ నేపథ్యంలో రాజధానిలో టపాసులు కాల్చడం, విక్రయించడం, తయారు చేయడంపై నిషేధం ఉంది. వాహన కాలుష్యంపై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వాయు కాలుష్యం కారణంగా దేశ రాజధానిలో ప్రతీ సంవత్సరం శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

 

Related News

New GST Rates: GST 2.O లో తగ్గిన వస్తువుల.. ధరల లిస్ట్ ఇదే

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Big Stories

×