BigTV English
Advertisement

Sushil Karki: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా.. బాధ్యతలు స్వీకరించిన సుశీల కర్కీ..

Sushil Karki: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా.. బాధ్యతలు స్వీకరించిన సుశీల కర్కీ..

Sushil Karki: నేపాల్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సుశీల కర్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశంలో నెలకొన్న అల్లర్లు, హింసాత్మక సంఘటనలపై దృష్టి సారించారు. శాంతి, భద్రతను కాపాడడం తన ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టంగా తెలిపారు. అదే సమయంలో, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు సాగతానని కర్కీ ప్రకటించారు.


హింసపై న్యాయ విచారణ ఆదేశం

నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ సంఘటనలు దేశంలోని ఆర్థిక కార్యకలాపాలకు పెద్ద దెబ్బతీశాయి. పరిస్థితిని అదుపులోకి తేవడంలో పోలీసులు, పరిపాలనా వ్యవస్థ పలు చర్యలు చేపట్టినా శాంతి పూర్తిగా నెలకొనలేకపోయింది. ఈ పరిస్థితుల్లో సుశీల కర్కీ తాత్కాలిక ప్రధాని పదవిలో చేరగానే హింసాత్మక ఘటనలపై న్యాయ విచారణ చేపట్టాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా తెలిపారు.


ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం

అల్లర్లు, హింస కారణంగా నేపాల్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా దెబ్బతిన్నదని కర్కీ పేర్కొన్నారు. వ్యాపారాలు నిలిచిపోవడం, రవాణా వ్యవస్థ దెబ్బతినడం, పెట్టుబడులు తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తాయని ఆయన వివరించారు. ప్రధానంగా పర్యాటక రంగం, చిన్న వ్యాపారాలు, రవాణా రంగం తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించడానికి శాంతి, సామరస్య వాతావరణం అవసరమని ఆమె స్పష్టంగా తెలియజేశారు.

మోడీపై ప్రశంసలు

ప్రపంచంలోని లీడర్లలో భారత ప్రధాని మోడీ అత్యంత ప్రభావితమైన వ్యక్తి అని అభివర్ణించారు. మోడీ నాయకత్వంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ రంగాలలో భారత్ సాధించిన పురోగతిని ప్రశంసిస్తూ, నేపాల్ కూడా ఆ మార్గంలో పయనించేందుకు ప్రయత్నిస్తుందని కర్కీ తెలిపారు.

ఇండియాతో సత్సంబంధాలు

నేపాల్ , భారతదేశం మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను కర్కీ గుర్తుచేశారు. ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, భవిష్యత్తులో మరింత బలపడాలని ఆకాంక్షించారు. వాణిజ్యం, రవాణా, భద్రత రంగాలలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా పరస్పర ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

శాంతి, అభివృద్ధి పై దృష్టి

తన తాత్కాలిక పాలనలో శాంతి పునరుద్ధరణ, హింసాత్మక చర్యలకు చెక్ పెట్టడం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రధాన లక్ష్యాలుగా తీసుకుంటానని కర్కీ హామీ ఇచ్చారు.

Also Read: రోడ్డు మీద చెత్త వేస్తున్నారా.. అయితే జైలు శిక్ష ఖాయం!

నేపాల్ ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో సుశీల కర్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం కీలకంగా మారింది. హింసపై న్యాయ విచారణ, ఆర్థిక పునరుద్ధరణ, భారతదేశంతో సత్సంబంధాల బలోపేతం వంటి అంశాలు ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. అయినప్పటికీ, ఆయన తీసుకున్న తొలి నిర్ణయాలు ప్రజల్లో ఆశలు కలిగిస్తున్నాయి. శాంతి, అభివృద్ధి దిశగా నేపాల్ నడిచే అవకాశాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది.

Related News

Saudi Crime: ఎన్‌కౌంటర్లో చిక్కుకున్నాడు.. చనిపోయే ముందు భార్యకు వాయిస్ నోట్ పంపాడు!

ISIS terrorist confess: పాక్ బట్టలిప్పిన టెర్రరిస్ట్.. ఐసీస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారంటూ వాంగ్మూలం

Aadhaar Updates: ఇకపై ఆధార్ అప్డేట్ చాలా సింపుల్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

Mumbai Hostage: 5 రోజుల ప్లానింగ్, 3 గంటల భయం, ఒక్క బుల్లెట్‌కు హతం.. ఇది కిడ్నాపర్ కథ!

NDA Manifesto: యువతకు కోటి ఉద్యోగాల హామీ.. బీహార్ ఎన్డీయే మేనిఫెస్టో రిలీజ్

PM Modi: సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌కు.. ప్రధానీ మోదీ నివాళి

Bengaluru: బెంగళూరులో చెత్తను ఇళ్ల గుమ్మం వద్ద వేస్తున్న మున్సిపల్ అధికారులు.. ఎందుకంటే!

Fake Eno: మార్కెట్ లో నకిలీ ఈనో ప్యాకెట్లు.. ఈజీగా గుర్తు పట్టాలంటే ఇలా చేయండి

Big Stories

×