E-Paper
Advertisement

Sarath Kumar’s AISMK Merged in BJP: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం..

Sarath Kumar’s AISMK Merged in BJP: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం..

Sarath Kumar

Actor Sarath Kumar Merged AISMK Party in BJP: సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడులో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి.. ఏఐఎస్ఎంకేను బీజేపీలో విలీనం చేయడం ఆసక్తిగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో పార్టీని విలీనం చేశారు.

చెన్నైలో ఏఐఎస్ఎంకే కార్యకర్తలకు శరత్ కుమార్ సందేశమిచ్చారు. దేశ ఐక్యత కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. అలాగే భారత్ ఆర్థిక వృద్ధి కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. డ్రగ్స్ కల్చర్ ను అంతం చేసి యువత మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేయాలని తన పార్టీ కార్యకర్తలకు శరత్ కుమార్ పిలుపునిచ్చారు.

Also Read: హర్యానా కొత్త సీఎంగా నాయబ్‌ సింగ్ సైనీ.. కాసేపట్లో ప్రమాణస్వీకారం..

సినీ నటుడు మంచి పేరు సంపాదించిన శరత్ కుమార్ 1996లో రాజకీయాల్లో ప్రవేశించారు. తొలుత డీఎంకేలో చేరారు. 2001 రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. అయితే 2006 అసెంబ్లీ ఎన్నికల ముందు శరత్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే వీడారు. వెంటనే తన భార్య రాధికతో కలిసి అన్నాడీఎంకే గూటికి చేరారు. కానీ ఆ పార్టీలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. కొద్ది కాలానికే అన్నాడీఎంకేను బయటకు వచ్చేశారు.

శరత్ కుమార్ 2007 ఆగస్టులో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్టిగా పేరు పెట్టారు. ఏ ఎన్నికల్లోనూ ఏఐఎస్ఎంకే పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు లోక్ సభ వేళ బీజేపీలో తన పార్టీని విలీనం చేశారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×