BigTV English
Advertisement

Sarath Kumar’s AISMK Merged in BJP: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం..

Sarath Kumar’s AISMK Merged in BJP: తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం.. బీజేపీలో శరత్ కుమార్ పార్టీ విలీనం..

Sarath Kumar


Actor Sarath Kumar Merged AISMK Party in BJP: సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడులో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి.. ఏఐఎస్ఎంకేను బీజేపీలో విలీనం చేయడం ఆసక్తిగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో పార్టీని విలీనం చేశారు.

చెన్నైలో ఏఐఎస్ఎంకే కార్యకర్తలకు శరత్ కుమార్ సందేశమిచ్చారు. దేశ ఐక్యత కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. అలాగే భారత్ ఆర్థిక వృద్ధి కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. డ్రగ్స్ కల్చర్ ను అంతం చేసి యువత మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు.


తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పని చేయాలని తన పార్టీ కార్యకర్తలకు శరత్ కుమార్ పిలుపునిచ్చారు.

Also Read: హర్యానా కొత్త సీఎంగా నాయబ్‌ సింగ్ సైనీ.. కాసేపట్లో ప్రమాణస్వీకారం..

సినీ నటుడు మంచి పేరు సంపాదించిన శరత్ కుమార్ 1996లో రాజకీయాల్లో ప్రవేశించారు. తొలుత డీఎంకేలో చేరారు. 2001 రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. అయితే 2006 అసెంబ్లీ ఎన్నికల ముందు శరత్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే వీడారు. వెంటనే తన భార్య రాధికతో కలిసి అన్నాడీఎంకే గూటికి చేరారు. కానీ ఆ పార్టీలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. కొద్ది కాలానికే అన్నాడీఎంకేను బయటకు వచ్చేశారు.

శరత్ కుమార్ 2007 ఆగస్టులో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్టిగా పేరు పెట్టారు. ఏ ఎన్నికల్లోనూ ఏఐఎస్ఎంకే పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు లోక్ సభ వేళ బీజేపీలో తన పార్టీని విలీనం చేశారు.

Tags

Related News

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Big Stories

×