BigTV English
Advertisement

Sandeshkhali Protest: దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ ఘటన.. స్పందించిన బెంగాల్‌ డీజీపీ

Sandeshkhali Protest: దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ ఘటన.. స్పందించిన బెంగాల్‌ డీజీపీ

Bengal DGP responded: బెంగాల్‌ సందేశ్‌ఖలీనీలోని నిరసనలు కదిలించాయి. ఈ ఘటనపై బెంగాల్ డీజీపీ రాజీవ్‌ కుమార్‌ స్పంధించారు. సంఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీఎంసీ నాయకులు ఆ ప్రాంతంలో మహిళలపై లైంగిక వేధింపులు, బలవంతంగా భూ సేకరణకు పాల్పడ్డారని ఆరోపించారు.


కర్రలతో దాడి చేసి.. బెల్మజూర్‌ ప్రాంతంలోని ఫిషింగ్‌ యార్డ్‌ సమీపంలో ఉన్న గడ్డి పాకలను తగలబెట్టారు. టీఎంసీ నాయకుడు షాజహాన్‌ షేక్‌తో పాటు అతని సోదరుడు సిరాజ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పోలీసులు ఏమీ చేయలేదు. అందుకే మా భూమి, గౌరవం తిరిగి పొందడానికి మేము ప్రతిదీ చేస్తున్నామని ఒక నిరసనకారుడు చెప్పాడు.

అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం కుమార్ నది సమస్యాత్మక ప్రాంతానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. మీరు ఫిర్యాదు చేయండి మేము ఇక్కడ పోలీసు క్యాంపును ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాము. కానీ దయచేసి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు అని తెలిపారు.


Read More: కేజ్రీవాల్ ను అరెస్టు చేయించాలని కుట్ర.. ఢిల్లీ మంత్రుల సంచలన వ్యాఖ్యలు..

మీడియాతో మాట్లడిన కుమార్‌ ఈ ప్రాంతంలో చట్టబద్ధమైన పాలనను ఏర్పాటు చేస్తామని కుమార్ అన్నారు. డీజీపీ బుధవారం సందేశ్‌ఖాలీని సందర్శించి అక్కడి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన గురువారం కోల్‌కతాకు తిరిగి వచ్చారు. సందేశ్‌ఖాలీలో జనవరి 5న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై మూక దాడి జరిగినప్పటి నుండి షాజహాన్ అధికారులను తప్పించుకున్నాడు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×