E-Paper
Advertisement

US : అమెరికాలో భారత దౌత్య కార్యాలయానికి నిప్పు.. ఖలిస్థానీ మద్దతుదారులపై అనుమానం..

US : అమెరికాలో భారత దౌత్య కార్యాలయానికి నిప్పు.. ఖలిస్థానీ మద్దతుదారులపై అనుమానం..

US : అమెరికాలో భారత్ దౌత్య కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. శాన్‌ ఫ్రాన్సిస్‌కోలోని ఇండియన్ కాన్సులేట్‌ కు దుండగులు నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. 5 నెలల వ్యవధిలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. మార్చిలో ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు.

దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ‍అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడిని అమెరికా ఖండించింది. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

మార్చిలో భారత్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్‌ పాల్ సింగ్‌ ను పట్టుకునేందుకు కేంద్రం వేట కొనసాగించింది. ఆ సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు శాన్‌ఫ్రాన్సిస్‌కోలో దౌత్య కార్యాలన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అమృత్‌పాల్‌ సింగ్‌ను వదిలేయాలని నినాదాలు చేశారు. ఇప్పుడు రెండోసారి దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×