BigTV English
Advertisement

Siddaramaiah: ‘ఇంకెవరు కొత్తగా ముఖ్యమంత్రి అవుతారు..? నేనే సీఎంగా..’

Siddaramaiah: ‘ఇంకెవరు కొత్తగా ముఖ్యమంత్రి అవుతారు..? నేనే సీఎంగా..’

Karnataka CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) కుంభకోణంపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్న వేళ సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య వైదొలిగితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై స్థానికంగా తీవ్ర నడుస్తున్నది. ఈ క్రమంలో సిద్ధరామయ్య స్పందించారు. సీఎం పీఠం ఏమీ ఖాళీగా లేదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.


బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీటు ఎవరూ ఆక్రమించుకునేందుకు అదేమీ ఖాళీగా లేదు. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనే వెలువడలేదు. అసలు దీనిపై చర్చ అనవసరం. ఇంతకు సీఎం కుర్చీ ఖాళీగా లేనప్పుడు ఇంకెవరు కొత్తగా ముఖ్యమంత్రి అవుతారు..? ఆ పదవిలో నేనే కొనసాగుతాను. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read: మేము ఉన్నంత వరకూ.. దానిని టచ్ కూడా చేయలేరు : రాహుల్ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందన


ఇదిలా ఉంటే.. ఒకవేళ కర్ణాటక రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాల్సి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న మంత్రులు, సీనియర్లను హెచ్చరించాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం లేఖ రాసింది.

మరోవైపు.. ముఖ్యమంత్రి పదవిపై వస్తున్న ఊహాగానాలకు అడ్డుకట్ట వేయాలంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ భండారి, ఎమ్మెల్సీ దినేశ్ గూలిగౌడలు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రిక్వెస్ట్ చేశారు.

అయితే, మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మకు వారసత్వంగా వచ్చినటువంటి భూములను ‘ముడా’ స్వాధీనం చేసుకుని మరోచోట స్థలాలు ఇచ్చింది. అయితే, స్వాధీనం చేసుకున్న ఆ భూముల కంటే ముడా మరో చోట ఇచ్చిన భూముల విలువ ఎక్కువగా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం విధితమే.

Also Read: 70 ఏళ్లు పైబడినవారికి గొప్ప శుభవార్త.. ఉచితంగా రూ. 5 లక్షలు..

ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ తాఖీదులను జారీ చేశారు. ఇందుకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధరామయ్య హాజరు కావాలంటూ ఆ తాఖీదుల్లో పేర్కొన్నారు. వీటిని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సీఎం మారొచ్చంటూ స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందించి పై విధంగా పేర్కొన్నారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×