E-Paper
Advertisement

Delhi-NCR Earthquake: ఆఫ్ఘాన్ ఎఫెక్ట్ ఢిల్లీని తాకింది.. మళ్లీ భూప్రకంపనల భయం

Delhi-NCR Earthquake: ఆఫ్ఘాన్ ఎఫెక్ట్ ఢిల్లీని తాకింది..  మళ్లీ భూప్రకంపనల భయం
Advertisement

Delhi-NCR Earthquake:  ఆఫ్ఘనిస్తాన్‌ను రెండురోజుల కింద భారీ భూకంపం కుదిపేసింది. అత్యంత శక్తివంతమైన భూకంపం వల్ల దాదాపు 2,200 మందికి పైగా మృత్యువాత పడ్డారు. క్షతగ్రాతుల గురించి చెప్పనక్కర్లేదు. 3,600 మంది వరకు ఉంటారని తెలుస్తోంది. దశాబ్దం తర్వాత ఆ దేశంలో ఈ స్థాయిలో వచ్చిన భూకంపం ఇదే. దీని నష్టం గురించి చెప్పనక్కర్లేదు.

ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రకటన ప్రకారం నంగర్హార్, దాని పరిసర ప్రాంతాలలో 160 కిలోమీటర్లలో ఈ భూకంపం సంభవించింది. దాని ప్రభావం ఇండియాలోని జమ్మూకాశ్మీర్, ఢిల్లీ ప్రాంతాలపై పడింది. అక్కడ కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ-NCS తెలిపింది. భూమికి 135 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు తెలుస్తోంది.

Advertisement

భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  ఈ లెక్కన ఉత్తరాదిలో ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశమున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇకపై పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లో ఆ తరహా ప్రకంపనలు వస్తే ఉత్తరాదికి ముప్పే ఉన్నట్టే.

బుధవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దాని తీవ్రత 6.0 నమోదు అయ్యింది.  దాని ధాటికి అనేక గ్రామాలు నేల మట్టమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో శిధిలాలు దిబ్బగా మారిపోయాయి. అక్కడి ప్రజలు మట్టి-ఇటుకలు-కలపతో నిర్మించిన ఇళ్ల శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారు.

Advertisement

ALSO READ: అమెరికా కూల్ డ్రింక్స్ ఇక బంద్.. ఆ రాష్ట్రంలో హోటళ్లు కీలక నిర్ణయం

నంగర్హార్-లాగ్మాన్ ప్రావిన్సుల్లో మరో 12 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. స్వచ్ఛంద సంస్థలు, అక్కడి సైన్యం శిథిలాల నుండి చిక్కుకుపోయినవారిని బయటకు తీస్తున్నారు. అయితే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని చెబుతున్నారు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అత్యవసర సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

కునార్‌ ప్రాంతంలో 5,400 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇటీవల ఆ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలు సహాయక బృందాలు చేరుకోలేదు. ఈలోగా ప్రకృతి భూకంపం రూపంలో కన్నెర్ర చేసింది. మరోవైపు ఆఫ్ఘాన్ భూకంప బాధితులకు సహాయంలో భారత్ నిమగ్నమైంది.

భారత్ నుంచి ఓ విమానం కాబూల్‌కు చేరుకుంది. దుప్పట్లు, టెంట్లు, పరిశుభ్రత కిట్లు, నీటి నిల్వ ట్యాంకులు, జనరేటర్లు, వంటగది పాత్రలు, పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్లు, స్లీపింగ్ బ్యాగులు, అవసరమైన మందులు, వీల్‌చైర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వైద్య వినియోగ వస్తువులు సహా 21 టన్నుల సహాయ సామగ్రిని తరలించినట్టు ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.

Related News

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

Big Stories

Advertisement
×