E-Paper
Advertisement

Union Home Minister Amit Shah: 2026 నాటికి నక్సలిజం రూపుమాపుతాం.. కేంద్ర మంత్రి అమిత్ షా

Union Home Minister Amit Shah: 2026 నాటికి నక్సలిజం రూపుమాపుతాం.. కేంద్ర మంత్రి అమిత్ షా

Amit Shah strategy against Left Wing Extremism: 2026 నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వివిధ రాష్ట్రాల సీనియర్ అధికారులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

మావోయిస్ట్ తీవ్రవాదులపై చివరి దాడికి నిర్ణాయక, కఠని వ్యూహం అవసరం ఉందని అమిత్ షా చెప్పారు. హింసను నక్సల్స్ విడిచిపెట్టాలని కోరిన కేంద్ర హోం మంత్రి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం వీరి లొంగుబాటుకు త్వరలో కొత్త విధానాన్ని ప్రకటించనున్నట్లు తెలిపింది. అయితే ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారిన నక్సలిజం మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటివరకు 17వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

కానీ, 2004 నుంచి 2014 మధ్య కాలంతో పోల్చితే.. 2014 నుంచి 2024 మధ్యలో దేశంలో నక్సల్ సంబంధిత ఘటనల్లో సగానికి పైగా తగ్గుముఖం పట్టిందని షా వెల్లడించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలిజం ఘటనలు 53 శాతం తగ్గుదల నమోదైందన్నారు. వామ పక్ష తీవ్రవాదాన్ని చివరి దెబ్బ తీసేందుకు భద్రతా లోపాలను సరిచేస్తున్నామన్నారు.

Also Read: ‘బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. మరి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలెందుకు..?’

మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీసేందుకు ఎన్ఐఏ, ఈడీ వంటి విభాగాలను భద్రతా విభాగాలతో సమన్వయ పరుస్తున్నామని చెప్పారు. పక్కా ప్రణాళికతో 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏడు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×