BigTV English
Advertisement

JD Vance India Visit: ఫ్యామిలీలో భారత్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు, మోదీతో జేడీ వాన్స్ భేటీ

JD Vance India Visit: ఫ్యామిలీలో భారత్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు, మోదీతో  జేడీ వాన్స్ భేటీ

JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టారు. ఆయనతోపాటు భార్య ఉషా వాన్స్ కూడా వచ్చారు. సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన సమావేశం కానున్నారు. అమెరికా-భారత్ లకు సంబంధించి వాణిజ్యం,ప్రాంతీయ భద్రత, పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.


అమెరికా ఉపాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే ఫస్ట్ టైమ్. వాన్స్ వెంట భార్య, ముగ్గురు పిల్లలు ఆ దేశ ప్రతినిధులు ఉన్నారు. అందులో రక్షణ శాఖ, విదేశాంగశాఖ అధికారులు ఉన్నారు. ఎయిర్‌పోర్టులో వాన్స్‌కు సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి.

జేడీ వాన్స్ టూర్ షెడ్యూల్


సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వాన్స్‌ దంపతులకు తన నివాసంలో ప్రధాని స్వాగతం పలుకుతారు. ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. విందు తర్వాత రాత్రికి వాన్స్‌ దంపతులు జైపూర్ వెళ్లనున్నారు.

ఢిల్లీ టు జైపూర్

విలాసవంతమైన రాంభాగ్‌ ప్యాలెస్‌ హోటల్‌లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం అక్కడ పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనుంది వాన్స్ ఫ్యామిలీ. మధ్యాహ్నం రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఆయన ప్రసంగిస్తారు. ట్రంప్‌ హయాంలో భారత్-అమెరికా సంబంధాల గురించి మాట్లాడనున్నారు. ఈ సమావేశానికి దౌత్యవేత్తలు, విదేశీ పాలసీ నిపుణులు, ఇండియా అధికారులు, విద్యావేత్తలు హాజరుకానున్నారు.

ALSO READ: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 8 మంది మావోలు హతం

జైపూర్ టు అమెరికా

23న వాన్స్‌ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్‌‌మహల్‌, శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం మళ్లీ జైపూర్‌కు వెళ్తారు. 24న అక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్లనున్నారు. ప్రధాని మోదీ-అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. భేటీ తర్వాత వాన్స్‌ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు.

భారత్‌ నుంచి వెళ్లిన విద్యార్థుల అంశంపైనా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఉషా వాన్స్ పూర్వీకులు సొంతూరు విజయవాడ. ఈ టూర్ లో ఆమె కచ్చితంగా విజయవాడకు వస్తారని చాలామంది భావించారు. కాకపోతే షెడ్యూల్ ముందుగా ఫిక్స్ కావడం రాలేకపోతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×