BigTV English
Advertisement

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Uttar Pradesh Wolf Attacks| ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తోడేళ్లు మానవ నివాస ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 7 మంది చిన్న పిల్లలే ఉండడం ఆందోళనకర పరిస్థితులను సూచిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక 8 ఏళ్ల బాలుడుపై తోడేళు దాడి చేసింది. ఈ దాడిలో ఆ పిల్లాడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.


ఉత్తర్ ప్రదేశ్ లోని భైరాచ్, ఝాన్సీ ప్రాంతాల్లో తోడేళ్లు మనుషులపై విరుచుకుపడుతున్నాయి. దీంతో ఫారెస్ట్ విభాగం అధికారులు తోడేళ్లను పట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటివరకు 7 తోడేళ్లను పట్టకుని జూ పార్క్ లకు తరలించినట్లు తెలిపారు. అయినా దాడులు ఆగడం లేదు.

ఈ ఘటనలపై ఉత్తర్ ప్రదేశ్ మహిళా మంత్రి బేబీ రాని మౌర్యను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తోడేళ్లు దాడులు ఆపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? అని విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి బేబీ రాని మాట్లాడుతూ.. ‘తోడేళ్లను అంత సులువుగా పట్టుకోలేం. ఎందుకంటే ఆ జంతువులు ప్రభుత్వం కంటే తెలివనవి’ అని సమాధానమిచ్చారు.


”తోడేళ్ల కోసం చాలా మంది అటవీ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మేము వాటిని పట్టుకుంటామ. కానీ సమయం కావాలి. ఎందుకంటే తోడేళ్లు ప్రభుత్వం కంటే తెలివైన జంతువులు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. త్వరలోనే తోడేళ్లను పట్టకుంటాం. అటవీ శాఖ మంత్రి స్వయంగా ఈ సమస్యను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు.

Also Read: కాల్ గర్ల్ తల నరికి యువతి సోదరుడి ఇంట్లో పెట్టిన ప్రియుడు.. ఎందుకు చేశాడంటే..

శుక్రవారం భైరాచ్ నగరంలో మహ్ సీల్ మండలంలో ఒక 8 ఏళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా అనుకోకుండా ఒక తోడేలు పిల్లాడిపై దాడి చేసిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. తోడేలు.. బాలుడి ముఖంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. గత రెండు నెలలుగా జరుగుతున్న తోడేలు దాడుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోగా 36 మంది గాయపడ్డారని అధికారిక సమాచారం.

30 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఉత్తర్ ప్రదేశ్ లో తోడేళ్లు మనుషులపై దాడుల చేశాయి. ఆ సమయంలో 9 నెలల కాలంలో దాదాపు 30 మంది పిల్లలను తోడేళ్లు చంపేశాయి. 1996 -97 సంవత్సరాలలో జరిగిన తోడేలు దాడులపై వైల్డ్ లైఫ్ సైంటిస్ట్, ఫారెస్ట్ ఆఫీసర్ అధ్యయనం చేయగా.. షాకింగ్ విషయాలు తెలిశాయి.

ఈ దాడులన్నీ ఒకే తోడేలు చేస్తోందని.. దాడి చేసిన ప్రతీసారి.. తదుపరి దాడి కోసం ఇతర గ్రామాలకు వెళ్లిపోతుందని తేలింది. అందువల్లే ఘటన జరిగిన ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆ ప్రత్యేక తోడేలు కనిపించలేదని తెలిసింది. ఈ దాడులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్ పూర్, ప్రతాప్ గడ్, సుల్తాన్ పూర్ జిల్లాల్లో జరిగాయి. ఆ తోడేలు.. ఒంటరిగా ఉన్న మానవులపై ఒక్కసారి దాడి చేసి వారిని అడవిలోకి ఈడ్చుకెళుతుంది. ఆ తరువాత శవంలోని కొన్ని భాగాలు తీసుకెళ్లి తన గుంపులోని తోడేళ్లకు ఆహారంగా ఇస్తోందని పరిశోధనలో బయటపడింది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×