E-Paper
Advertisement

Vande Bharat Express: దూసుకెళ్తున్న వందేభారత్.. రికార్డ్ స్థాయిలో ఆక్యుపెన్సీ

Vande Bharat Express: దూసుకెళ్తున్న వందేభారత్.. రికార్డ్ స్థాయిలో ఆక్యుపెన్సీ

Vande Bharat Express: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు దూసుకెళ్తున్నాయి. విమాన ప్రయాణానికి ఏమాత్రం తగ్గకుండా.. దేశవ్యాప్తంగా మొత్తం 10 రైళ్లు సేవలందిస్తున్నాయి. అలాగే తక్కువ సమయంలో గమ్యస్థానాన్ని చేర్చుతుండడంతో ఎక్కువ మంది వీటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిత్యం రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

తాజాగా ఈ రైళ్ల ఆక్యుపెన్సీకి సంబంధించిన నివేదికను రైల్వే అధికారులు విడుదల చేశారు. అందులో 5 రైళ్లు వందశాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తుండగా.. మిగతా ఐదు తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ముంబై-గాంధీనగర్ మధ్యలో నడిచే రైలు రికార్డు స్థాయి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. 127 శాతం మేర భర్తీ అవుతూ దూసుకెళ్తోంది. అలాగే సికింద్రాబాద్-విశాఖ, ఢిల్లీ -వారణాసి మార్గంలో నడుస్తున్న రైళ్లు 125.76శాతం భర్తీ అవుతూ నడుస్తుంది.

బిలాస్‌పుర్-నాగ్‌పుర్ మధ్యలో నడిచే రైలు అత్యల్పంగా కేవలం 55 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది 100.72 సగటు ఆక్యుపెన్సీని వందేభారత్ రైళ్లు నమోదు చేశాయి. ఇప్పటి వరకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు మొత్తం 1635 ట్రిప్పుల్లో 20 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×