Vijay Mallya: కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రన్ చేయడం కోసం విజయ్ మాల్యా మన బ్యాంకుల నుంచి దాదాపు 9 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ అప్పులు కట్టకుండా చేతులెత్తేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. 2016 మార్చిలో ఆయన దేశం విడిచి పారిపోగా, 2019లో కోర్టు ఆయన్ని పరారైన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. ఆ వెంటనే ఆయన ఆస్తులన్నీ సీజ్ చేసి, అప్పులు రికవరీ చేసే పనిలో పడ్డారు అధికారులు. దీనికి వ్యతిరేకంగా మాల్యా బాంబే హైకోర్టులో పిటిషన్లు వేసి పోరాటం మొదలుపెట్టారు..
ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు పర్మిషన్
ఈ పిటిషన్లపై జస్టిస్ మిలింద్ జాదవ్ బెంచ్ రీసెంట్గా విచారణ జరిపింది. గతంలో ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులు తన ఆస్తులను వాడుకునేందుకు ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇలా పర్మిషన్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ మాల్యా 2020లో వేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు ఇప్పుడు మాట్లాడింది. ఈడీ సీజ్ చేసిన ఆస్తుల ప్రెసెంట్ కండిషన్ ఏంటి, ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. పాత గొడవలను పట్టుకుని వేలాడకుండా ముందుకు వెళ్లాలని స్పష్టం చేసింది.
సెంట్రల్ గవర్నమెంట్ లండన్ గవర్నమెంట్తో చర్చలు
తనపై ఉన్న FEO చట్టం లీగాలిటీని ప్రశ్నిస్తూ మాల్యా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరగాలంటే.. ఆయన ముందు కోర్టు ముందు వచ్చి నిలబడాలని హైకోర్టు తెగేసి చెప్పింది. డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిన మాల్యాను ఎలాగైనా ఇండియాకు రప్పించడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ లండన్ గవర్నమెంట్తో చర్చలు జరుపుతూనే ఉంది.
Also Read: శ్రీకాకుళంలో భారతమాతే గ్రామదేవత.. కపాసుకుద్ది ఆలయ చరిత్ర ఇదే!