E-Paper
Advertisement

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌ మళ్లీ చంద్రబాబేనా?

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌ మళ్లీ చంద్రబాబేనా?

NDA Convener: ఎన్డీయే సమావేశంలో ఏం జరిగింది? మోదీ సర్కార్ అజెండా ఏంటి? కీలక విషయాలను సమావేశంలో ప్రస్తావించారా? మోదీ అజెండాపై ఎన్డీయేలోని మిగతా పార్టీలు ఏమంటున్నాయి? చర్చ జరిగిన మూడు అంశాలేంటి? మళ్లీ ఎన్డీయే కన్వీనర్‌గా సీఎం చంద్రబాబును నియమించాలని భావిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చింది. కేవలం 100 రోజుల్లో తొలి ఎన్డీయే సమావేశం జరిగింది. గురువారం చండీగఢ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఎన్డీయేలోని పార్టీల అధినేతలు హాజరయ్యారు. రానున్న ఐదేళ్లలో బీజేపీ తన అజెండాను బయట పెట్టినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ అజెండా ఏంటి?

రాబోయే ఐదేళ్లలో ఏయే అంశాలు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుందో బీజేపీ వాటిని సమావేశంలో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయా సమస్యలను అధిగమించాలంటే ఎన్డీయే కన్వీనర్‌ ఉండాలని కొందరు నేతలు సూచించారట. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీయే 3.0లో బీజేపీకి మెజార్టీ తక్కువగా ఉండడం ఒకటైతే, అనేక కీలకమైన బిల్లులున్నాయి.

బీజేపీ తీసుకొచ్చిన అజెండాలో ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’, జన గణన, కామన్ సివిల్ కోడ్ బిల్లులు తెచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లుకు మూడు రాజ్యాంగ సవరణలు అవసర మన్నది కొందరి నేతల మాట. దీనికితోడు మరో 15 సవరణలు చేయాల్సివుందట.

ALSO READ: భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ

రాష్ట్రాలు దాదాపు 70 శాతం అంగీకరించాల్సి ఉంటుంది. దీని నుంచి గట్టెక్కాలంటే లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు పాస్ కావాలి. రాష్ట్రాలను ఒప్పించడం బీజేపీకి కత్తిమీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా బిల్లులు పాస్ కావాలంటే అన్ని పార్టీలను కలుపుకు పోయే నేత అవసరమని భావించిందట ఎన్డీయే.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పేరు వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. బిల్లులకు మద్దతు విషయంలో సంప్రదింపులు, సమన్వయం చేసేందుకు ఆయనైతే బెటరని భావిస్తున్నారట కమలనాథులు.

గతంలో సీఎం చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్నప్పుడు వాజ్‌పేయ్ సర్కార్ ఐదేళ్లు సక్సెస్‌గా నడిపారు. కొన్ని బిల్లుల విషయంలో డీఎంకె పార్టీలు సైతం ఆనాడు ఆయన ఒప్పించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.

దీనికితోడు జన గణనను చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కామన్ సివిల్ కోడ్ వ్యవహారంపై బీజేపీకి సమస్యగా మారింది. ఈ మూడు బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్డీయే కార్యాచరణ ఉండాలని భావిస్తున్నారట. సందర్భాన్ని బట్టి సీఎం చంద్రబాబును కన్వీనర్‌గా ప్రకటించే అవకాశముందంటూ ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×