OTT Movies : క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేని సినిమాలు సైతం ఇక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. వరుసగా కొన్ని సినిమాలను ఓటీటీ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ సినిమాలకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. అందుకే అలాంటి సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ సైతం ఇంట్రెస్టింగ్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. తాజాగా ఓ సైకో థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు కొదవలేదు. ఇతర భాషల్లోనే కాకుండా తెలుగులో కూడా కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. భయంకరమైన హారర్ సీన్స్ ఉండే సినిమాల్లో హిడింబ ఒక్కటి. ఓంకార్ తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అశ్విన్ బాబు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు.. హారర్ సినిమాలతో భయపెడుతున్నాడు. 2023లో వచ్చిన సినిమానే హిడింబ. తెలుగులో సైకలాజికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన హిడింబతో అశ్విన్ బాబు ప్రయోగం చేశాడనే చెప్పాలి. అయితే, ఈ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ, ఓటీటీలోకి రిలీజ్ అయ్యాక మాత్రం మంచి పేరు తెచ్చుకుంది.. అయితే ఈ మూవీని మరోసారి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిడింబ మరో రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్లలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు భాషలోనే హిడింబ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ సినిమాను చూడొచ్చు.. అయితే హాట్ స్టార్ లో మాత్రం హిందీ బాషలో మాత్రమే చూసే అవకాశం ఉంది.
Also Read: ప్రభాస్పై మోజు పడ్డ పాకిస్తానీ హీరోయిన్… పాక్ మీడియా స్టూడియోలోనే అలా అనేసింది..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఇదొక భయంకరమైన హారర్ స్టోరీ.. ఒక్కసారి చూస్తే వణికి పోవాల్సిందే. గతంలో వచ్చిన అశ్విన్ సినిమాలు అలానే హారర్ కథలతో థియేటర్లలోకి వస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి తెలుగులో వచ్చిన ఈ సైకలాజికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ హిడింబను మూవీ సజెషన్ కింద చూడొచ్చు. ఈ స్టోరీలో అభయ్, ఆద్య ఇద్దరు పోలీస్ ట్రైనింగ్లో ఉండగా లవ్ చేసుకుంటారు. కానీ, కొన్ని కారణాలతో విడిపోతారు. ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అయితే అభయ్ మాత్రం హైదరాబాద్లో ఎస్సైగా చేస్తుంటాడు. సిటీలో అమ్మాయిలు ఒక్కొక్కరుగా మిస్ అవుతుంటారు. మరోవైపు సిటీలో అమ్మాయిలు అందరూ మిస్ అవుతుంటారు. ఆడవాళ్లను కిడ్నాప్ చేసి వారి రక్తం తాగుతుంటాడు ఆ కిడ్నాపర్. సీరియల్గా అమ్మాయిలు కిడ్నాప్ కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుంది. దాంతో ఇన్వెస్టిగేషన్ పని ఆద్యకు అప్పజెబుతారు.. ఆద్య, అభయ్ ఇద్దరు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే వారికి ఇందులో ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తాయి. అయితే చివరకు ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొని వస్తారో లేదో చూడాలి.. ఇందులో భయంకరమైన సీన్స్ ఉంటాయి.. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయ్యండి..