Thriller Movie in OTT : ఈ మధ్య ఓటీటీ లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని, ఓటీటీలో కూడా అదే టాక్ ని అందుకుంటాయి. ఈమధ్య వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. థియేటర్లలో సూపర్ హిట్ సినిమాలు తో పాటు ఓటిటిలో ఆసక్తికర కంటెంట్ సినిమాలో రిలీజ్ అవుతుండడంతో మూవీ లవర్స్ ఎక్కువగా ఇక్కడ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నిత్యం ఏదో ఒక సినిమా ఇక్కడ దర్శనమిస్తాయి. అలాంటి వాటిలో ఇప్పుడు ఓ మలయాళ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తుందో చూసేద్దాం..
మూవీ..
ఇటీవల మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు జనాలకు ఉత్కంఠ భరితమైన వినోదాన్ని అందిస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి ఈ ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలోకి వచ్చేస్తుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. బిగ్ బెన్.. మలయాళీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా, ఇది ఒక మలయాళీ కుటుంబం యూకేలో ఎదుర్కొనే కష్టాల గురించి చెబుతుంది. ఈ సినిమాను బిను ఆగుస్టీన్ డైరెక్ట్ చేసారు మరియు ఇది ప్రజాయ్ కామాత్, ఎల్డో థామస్ మరియు సిబి ఆరన్జానీ ద్వారా నిర్మించబడింది. ఈ సినిమాను అను మోహన్, వినయ్ ఫోర్ట్, విజయ్ బాబు, అదితి రవి, మియా జార్జ్ మరియు జాఫర్ ఇడుక్కి నటించారు.
ఓటీటీ..
బినో అగస్టీన్ దర్శకత్వం వహించిన బిగ్బెన్ మూవీ ఈనెల 30 నుంచే సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సినిమాలో అనుమోహన్, వినయ్ పోర్ట్, అదితి రవి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.. మార్చిలో సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు.
Also Read : ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మగాళ్లతో అలా చేస్తాను.. బాబోయ్ అరాచకం..
సినిమా స్టోరీ విషయానికొస్తే..
బిగ్ బెన్ ఒక మలయాళీ కుటుంబం యూకేలో ఎదుర్కొనే కష్టాల గురించి చెబుతుంది. ఈ సినిమాను 2024లో థియేటర్లలో విడుదల చేశారు. ఇది మిస్టరీ థ్రిల్లర్ జానర్ కి చెందినది మరియు ఇది ఒక మలయాళీ కుటుంబం ఎదుర్కొనే కష్టాలను, వారి అనుభవాన్ని వివరిస్తుంది. ఈ మూవీను ఓటీటీలో కూడా చూడవచ్చు.. ఈ నెల 30వ తేదీ నుండి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా ట్రైలర్ మరియు పోస్టర్లు మలయాళీ కుటుంబం యూకేలో ఎదుర్కొనే నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు..గత ఏడాది జూన్ నెలాఖరున ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన మియా జార్జ్ తెలుగులోనూ నటించింది. ఉంగరాల రాంబాబు మూవీలో సునీల్కు జోడీగా కనిపించింది. ఆమె నటించిన పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి.. థియేటర్లలో పాజిటివ్ ను టాక్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..