OG OTT: సినీ నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన తాజా చిత్రం “ఓజి”(OG). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ సినిమాని అందుకొని చాలా కాలం అయింది. ఇలాంటి తరుణంలోనే ఓజి అంటూ పవర్ ఫుల్ యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇలా థియేటర్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) వారు భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే తిరిగి ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాని అక్టోబర్ 23వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూసే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ గురించి నెట్ ఫ్లిక్స్ అధికారికంగా తెలియజేస్తూ ఒకానొక సమయంలో ముంబైలో తుఫాన్ ఉండేది.. ఇప్పుడు తిరిగి తుఫాన్ వచ్చేస్తోంది అంటూ ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ గురించి వెల్లడించారు.
ఇలా థియేటర్లలో వెండితెరపై అద్భుతం సృష్టించిన ఈ సినిమా తిరిగి ఓటీటీలో రాబోతోందనే విషయం తెలియగానే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ లో బీభత్సమైన క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే. మరి వెండితెరపై అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుజిత్(Sujeeth) దర్శకత్వం వహించగా పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)నటించారు.
Once upon a time in Mumbai, there lived a storm. And now, he’s back. 🌪️ pic.twitter.com/gILAkqzAW5
— Netflix India (@NetflixIndia) October 18, 2025
ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి వంటి తదితరులు కూడా కీలక పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ బిగ్ అప్డేట్ కూడా వెల్లడించారు ఓ.జి యూనివర్స్ నుంచి మరికొన్ని సినిమాలు రాబోతున్నాయని, త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ సినిమాల షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం దర్శకుడు సుజీత్ హీరో నానితో కలిసి బ్లడీ రోమియో అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతోంది. ఈ సినిమా పనులు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ఓజి సీక్వెల్ పనులలో సుజిత్ బిజీ కాబోతున్నారు.