E-Paper
Advertisement

OTT Movie : గ్యాంగ్ వార్ లో ఇరుక్కునే సామాన్యుడు … ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ … అందరికీ ఇచ్చిపడేశాడుగా

OTT Movie : గ్యాంగ్ వార్ లో ఇరుక్కునే సామాన్యుడు … ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ … అందరికీ ఇచ్చిపడేశాడుగా

OTT Movie : గ్యాంగ్ స్టర్ పాత్రలతో వచ్చే సినిమాలు వేడి,వేడిగా ఉంటాయి. ఇటువంటి పాత్రలతో వెబ్ సిరీస్ లు కూడా ఓటిటిలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో ధనుష్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. దక్షిణ తమిళనాడులో జరిగే ఒక గ్యాంగ్ వార్ లో, ఒక సామాన్యుడు ఎదుర్కొనే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

రెండు ఓటీటీ లలో స్ట్రీమింగ్

ఈ తమిళ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ పేరు ‘వడ చెన్నై’ (Vada Chennai). ఈ మూవీకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు.  దీనిని లైకా ప్రొడక్షన్స్ లో వండర్‌బార్ ఫిల్మ్స్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ కలసి నిర్మించాయి. ఇందులో ధనుష్, ఐశ్వర్య రాజేష్, కిషోర్, సముద్రఖని, డేనియల్ బాలాజీ, పవన్, ఆండ్రియా జెరేమియా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్టోరీ నాన్-లీనియర్ ఫార్మాట్‌లో ఉంటుంది. 1987 నుండి 2003 వరకు వివిధ టైమ్‌లైన్‌లలో జరిగే సంఘటనలను చూపిస్తుంది. ఒక సాధారణ క్యారమ్ ఆటగాడి నుండి, గ్యాంగ్‌స్టర్ లనే ఎదిరించే పాత్రలో ధనుష్ నటించారు. ఎడిటింగ్ జి. బి. వెంకటేష్, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), సోనీ లివ్ (Sony Liv) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

ఉత్తర చెన్నైలో రాజన్ అనే గ్యాంగ్‌స్టర్‌ను అతని అనుచరులే హత్య చేస్తారు. గుణ, సెంథిల్, వేలు, పజని, ఈ హత్య లో పాల్గొంటారు. ఈ హత్య తర్వాత, గుణ వేలును జైలుకు వెళ్లమని చెప్పి, వారిని బెయిల్‌పై తీసుకొస్తానని హామీ ఇస్తాడు సెంథిల్. అయితే బెయిల్‌పై విడిచిపెట్టనీయకుండా మోసం చేస్తాడు సెంథిల్. దీంతో వారి మధ్య శత్రుత్వం పెరుగుతుంది. రాజన్ భార్య చంద్ర తన భర్త మరణం తర్వాత గ్యాంగ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ స్టోరీ 1987లో జరుగుతుంది. పది సంవత్సరాల తరువాత అన్బు (ధనుష్) అనే యువకుడు క్యారమ్ ఆటగాడు కనిపిస్తాడు. అతను తన పరిసరాల్లోని గ్యాంగ్‌స్టర్ జీవితం నుండి దూరంగా ఉండి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటాడు.

అయితే, ఒక చిన్న గొడవ కారణంగా అన్బు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ గుణ, సెంథిల్ గ్యాంగ్‌ల మధ్య ఉన్న శత్రుత్వంలో చిక్కుకుంటాడు. గుణ సెంథిల్‌ను చంపమని అన్బును ఒప్పిస్తాడు. కానీ అన్బు సెంథిల్ గ్యాంగ్‌తో సన్నిహితంగా మెలుగుతూ అతనికి నమ్మకంగా ఉంటాడు. అదే సమయంలో పద్మ (ఐశ్వర్య రాజేష్) అనే అమ్మాయితో అన్బు ప్రేమలో పడతాడు.ఒక సారి అన్బు అనుకోకుండా ఒక హత్య చేస్తాడు. దీనివల్ల అతను ఒక కొత్త గ్యాంగ్‌స్టర్‌ అవతారం ఎత్త వలసి వస్తుంది. అన్బు తన ప్రజల కోసం నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది.ఎందుకంటే గుణ, సెంథిల్ రాజకీయ నాయకులతో కలిసి అన్బు నివసించే ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి ప్లాన్ చేస్తారు. చివరికి అన్బు ఈ గ్యాంగ్ లకు బుద్ధి చెబుతాడా ? పద్మ తో ప్రేమ ఎంతవరకు వెళ్తుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి.

Read Also : శక్తి వంతమైన రాణి … క్రూరమైన రాక్షసులు … మైండ్ బ్లాక్ అయ్యే ఫాంటసీ ఎంటర్టైనర్

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×