HILT Policy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిల్ట్ పాలసీ పేరుతో భారీ స్థాయిలో అవినీతి చేస్తోంని ఆరోపించారు. భూదందాల మీదే ప్రభుత్వం నడుస్తోందని ఏలేటి ఫైరయ్యారు.
ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరేం అనుకున్నా హాల్ట్ పాలసీ అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి అంటున్నారని, హౌజ్ కమిటీ వేసి రివ్యూ చేయాలనే కనీస జ్ఞానం లేదని విరుచుకుపడ్డారు. అప్పులు చేసి జల్సా చేస్తామనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెలో చనిపోయిన శంకర్ గౌడ్ కు రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని వ్యాఖ్యానించారు.
Also Read: బీఆర్ఎస్కు బిగ్ షాక్ తప్పదా.. ప్రీతిరెడ్డి అడుగులు కమళం గూటికేనా..!
అదే క్రీడాకారులకు రూ.కోటి, డీఎస్పీ ఉద్యోగం ఇచ్చారని, మరి శంకర్ గౌడ్ కు అలా ఎందుకు ఇవ్వరని ఏలేటి ప్రశ్నించారు. సామాన్య ప్రజల చావు అంటే ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. కాళేశ్వరం నుంచి ధరణి, ఈ కార్ రేస్ పై ఒక్క కేసు నమోదు చేయలేదని, ఇప్పటి వరకు ఎవ్వరిపై ఒక్క ఎఫ్ఐఆర్ నమోదవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీ ఎన్నిసార్లు ఎండగట్టినా దున్నపోతుపై వాన పడినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Also Read: ఏరోస్పేస్ హబ్గా తెలంగాణ.. 2047 లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్..!