E-Paper
Advertisement

సీనియ‌ర్ల‌ను మించి స‌బ్జెక్టు ప‌రంగా క‌విత ప‌రిణ‌తి! రైతు డిస్కంపై క‌విత లోతైన అధ్య‌య‌నం.. స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న పై ప్ర‌శంస‌లు..!

సీనియ‌ర్ల‌ను మించి స‌బ్జెక్టు ప‌రంగా క‌విత ప‌రిణ‌తి! రైతు డిస్కంపై క‌విత లోతైన అధ్య‌య‌నం.. స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న పై ప్ర‌శంస‌లు..!
Advertisement

వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన సుధీర్ఘ అనుభ‌వ‌మున్న సీనియ‌ర్ నాయ‌కులు నిరంజ‌న్ రెడ్డి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి గుంత‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి ల‌ను త‌ల‌ద‌న్నే విధంగా రైతు డిస్కమ్‌పై క‌విత ప్ర‌సంగం కొన‌సాగింది. ప్ర‌భుత్వం రైతు డిస్కంపై వ‌డివ‌డ‌గా అడుగులేస్తున్న త‌రుణం..జూన్ 2 వ‌ర‌కే పెట్టుకున్న డెడ్‌లైన్‌.. కేంద్రం ఒత్తిళ్ల మ‌ధ్య బీజేపీకి మేలు చేసే కంపెనీల‌కు దీన్ని దారాద‌త్తం చేసే ప్ర‌క్రియ ఇవ‌న్నీ… ఏక‌రువు పెట్టారామె. ఇప్ప‌టికే రెండు డిస్క‌మ్‌లు ఉండ‌గా.. మూడో డిస్కం పేరుతో రైతు డిస్కంను ప్ర‌వేశ‌పెట్ట‌డం మూలంగా రైతుకు ఒన‌గూరే లాభం ఇసుమంతైనా లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

ఈఆర్‌సీ ప‌బ్లిక్ హియ‌రింగ్‌లో ఆమె వెలిబుచ్చిన అంశాలే హైలెట్ అయ్యాయి. ఆంధ్ర ఉద్యోగుల పెత్త‌నం.. తెలంగాణ విద్యుత్ ఇంజినీర్ల‌కు జ‌రిగే న‌ష్టంపై కూడా ఆమె లోతైన అధ్య‌య‌నం చేసి మాట్లాడిన తీరు.. అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది. ఆమె ప్రాక్టిక‌ల్‌గా ఈ అంశంపై పాజిటివ్ కోణంలో ఆలోచించి ప‌లు సూచ‌న‌లు చేశారు. దీన్ని ప‌క్కా రాజ‌కీయ కోణంలో కేవ‌లం ఖండించిన‌మా అంటే ఖండించినం.. అనే రీతిలో స‌బ్జెక్టుపై ఆమె సవివ‌రంగా మాట్లాడిన తీరు అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న‌ది. దీన్ని తొల‌త పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేయాల‌ని క‌విత సూచించారు. దీని ద్వారా త‌లెత్తే స‌మ్య‌లపై ఓ అవ‌గాహ‌న వ‌స్తుంద‌ని, ఆ మేర‌కు ముందుకు సాగే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

Advertisement

రైతుల జిల్లాల వారీగా స‌మావేశాలు పెట్ట‌డం ద్వారా వారి అభిప్రాయాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ‌చ‌ని చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడున్న రెండు డిస్క‌మ్‌ల‌కు వేలాది కోట్ల నిధులు బ‌కాయి ప‌డి వాటి ఉనికిని ప్రశ్నార్థ‌కంలో ప‌డేసింద‌ని, ఇప్పుడు తామే పూచీక‌త్తుగా ఉండి రైతు డిస్కం కోసం హామీ ప‌డ‌టం అంటే.. అది ఎన్నో అనుమానాల‌కు తావిస్తుంద‌ని కూడా ఆమె చెప్పారు. చాల త‌క్కువ స‌మ‌యంలో ఆమె ఈ రైతు డిస్కంపై కీల‌క సూచ‌న‌లు చేయ‌డంతో పాటు.. ప్రాక్టిక‌ల్ స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తెచ్చి. స‌ర్కార్‌ను ఆలోచ‌న‌లో ప‌డేశారు. రైతు డిస్కంపై ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ముందుకు పోతే.. నాటి బ‌షీర్‌బాగ్‌లో జ‌గిరిన కాల్పుల ఘ‌ట‌న పున‌రావృత‌మవుతుంద‌ని ఆమె మెచ్చ‌రించ‌డ‌మ‌తో పాటు. టీఆరెస్ త‌రుపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మం చేప‌డ‌తామ‌ని కూడా ఆమె హెచ్చ‌రించారు.

ఆమె మాట్లాడే అంశం వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టేలా ఉన్నాయి. దీంతో ఆమె బీఆరెస్ సీనియ‌ర్ లీడ‌ర్ల‌ను మించి త‌న స్పంద‌న వినిపించాల‌నే అభిప్రాయ‌లు వెల్ల‌డ‌య్యాయి. ప్ర‌శంస‌లూ తోడ‌య్యాయి.

Related News

పాలమూరు జిల్లాలో అన్నాచెళ్లెల్ల పోటాపోటీ పర్యటనలు..! కొడంగల్‌లో కవిత భారీ బహిరంగ సభ.. ఒక రోజు ముందే కేటీఆర్‌ హడావుడి టూర్..

రామాయణంలో పిడకల వేట.. ఫామ్‌హౌజ్‌ల వెంట కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర..!

జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత దూరం.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై ఇక సర్కార్‌ నజర్.. ! మరో ఏడాది పట్టే అవకాశం..?

ఖైరతాబాద్‌ బైపోల్‌పై కమలం కన్ను.. జెండా పాతేందుకు బీజేపీ పక్కా స్కెచ్!

పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!

జనం చెవిలో నాడు పునరేకీకరణ పువ్వు! అదే బాటలో పయనించి నేడు కాంగ్రెస్‌ బొక్క బోర్లా..!

ఆస్తులు విశాలం.. భవంతులు సువిశాలం.. మనసులే ఇరుకిరుకు..!

శ్రీమంతుడు మా బాపు.. నడిమంతరపు సిరి నీది.. ఎప్పటికైనా సిరి సంపదలు మావి.. మా జాతే …!

Big Stories

Advertisement
×