Airtel Plan: దేశంలోనే రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ (Bharti Airtel) అత్యధిక ప్రాంతాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ 5జీ ఎస్ఏ (స్టాండ్ ఎలోన్) సేవలు కేవలం పోస్ట్పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎయిర్టెల్ రూ.649 ధరకు ఒక ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ బడ్జెట్లో మంచి వ్యాలిడిటీ, 5జీ సేవలు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని ఎయిర్ టెల్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.
ఎయిర్టెల్ అందిస్తున్న ఈ రూ.649 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ 4జీ డేటాతో పాటు అపరిమిత 5జీ (5G NSA) సేవలను పొందొచ్చు. 56 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ ద్వారా యూజర్ కు రోజుకు రూ.12 కంటే తక్కువ ఖర్చు కానుంది. అటు దేశవ్యాప్తంగా ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు కూడా ఈ ప్లాన్ లో పొందొచ్చు.
ఈ ప్లాన్లో లభించే ఉచిత 5జీ డేటా అపరిమితం కాదు. ప్రతి 30 రోజులకు 300 GB వరకు మాత్రమే 5జీ డేటాను వాడుకునే వెసులుబాటును ఎయిర్ టెల్ కల్పించింది. ఇది వినియోగదారులకు లభించే రోజువారీ 2 జీబీ 4జీ డేటాకు అదనంగా లభిస్తుండటం విశేషం.
Also Read: సామాన్యులకు పండగే.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్!
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు సుమారు రూ.4,000 విలువైన ‘అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం’ (Adobe Express Premium) సబ్స్క్రిప్షన్ 12 నెలల పాటు ఉచితంగా అందించనున్నారు. దీంతో పాటు సేఫ్ నెట్వర్క్ ఫీచర్, ప్రతీ 30 రోజులకు హలో ట్యూన్ సెట్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. మెుత్తంగా 56 రోజుల వ్యాలిడిటీతో 5G సేవలు కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: చాణక్యనీతి.. అమ్మాయిలు ఈ 5 విషయాలు ఇతరులకు చెప్పకూడదు