boAt Nirvana Eutopia 2 ANC: ప్రముఖ ఆడియో సంస్థ బోట్.. భారతదేశంలోకి మరొక ప్రీమియం హెడ్ఫోన్స్ను తీసుకొచ్చింది. boAt Nirvana Eutopia 2 ANC పేరుతో వచ్చిన ఈ ఓవర్-ఈర్ హెడ్ఫోన్స్ను మంచి సౌండ్ క్వాలిటీతో పాటు ఎక్కువసేపు బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. రోజూ పాటలు వినేవారికి, ప్రయాణాలు చేసేవారికి ఈ హెడ్ఫోన్స్ బాగా నచ్చుతుంది.
భారతదేశంలో ఈ కొత్త హెడ్ఫోన్స్ ధరను రూ.4,999గా నిర్ణయించారు. ఇవి కాస్మిక్ బ్లాక్, యుటోపియన్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తాయి. వీటిని బోట్ అధికారిక వెబ్సైట్తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు.
ఈ హెడ్ఫోన్స్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ బ్యాకప్ గురించే. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 80 గంటల పాటు నిరంతరంగా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా.. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, దాదాపు 12 గంటల పాటు పాటలు వినవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.
మంచి బేస్, స్పష్టమైన వాయిస్ అందించడానికి ఇందులో డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్ను అమర్చారు. హై-రెస్ ఆడియో, 3డి స్పేషియల్ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల సినిమాలు చూసినా, పాటలు విన్నా ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. బయటి శబ్దం ఏమీ వినపడకుండా ఉండేందుకు 45dB అడాప్టివ్ హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇచ్చారు. ఇది మనం ఉండే వాతావరణాన్ని బట్టి శబ్దాలను ఆటోమేటిక్గా తగ్గిస్తుంది.
ఇది బ్లూటూత్ 5.4 వెర్షన్పై పనిచేస్తుంది. గూగుల్ ఫాస్ట్పేర్ సపోర్ట్ వల్ల ఆండ్రాయిడ్ ఫోన్లకు త్వరగా కనెక్ట్ అవుతుంది. చెవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెమరీ ఫోమ్ కుషన్లు ఉపయోగించారు. వీటిని మడతపెట్టుకుని క్యారీ కేస్లో పెట్టుకుని ప్రయాణాల్లో సులభంగా తీసుకెళ్లవచ్చు. అలాగే ఫోన్ మాట్లాడేటప్పుడు స్పష్టత కోసం ఏఐ ఈఎన్ఎక్స్ సాంకేతికతను ఇందులో అందించారు.
Also Read: ఇంట్లో తేమగా ఉందని హ్యూమిడిఫైయర్ వాడుతున్నారా? నిపుణులు ఎందుకు వద్దంటున్నారో తెలిస్తే..