BigTV English
Advertisement

Phone EMI Default: ఈఎంఐలో ఫోన్ కొనుగోలు చేసి పేమెంట్ చేయలేదా?.. ఆర్బిఐ బిగ్ వార్నింగ్

Phone EMI Default: ఈఎంఐలో ఫోన్ కొనుగోలు చేసి పేమెంట్ చేయలేదా?.. ఆర్బిఐ బిగ్ వార్నింగ్

Phone EMI Default| ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారతదేశం ఒకటి. దేశంలో ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో ఫోన్లు సేల్ అవుతున్నాయి. అత్యధికంగా చైనాలో ఫోన్లు అమ్ముడుబోతున్నాయి. భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ప్రీమియం రేంజ్ నుంచి తక్కువ బడ్జెట్ వరకు ప్రజలు అన్ని ధరల సెగ్మెంట్లలో ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు.


స్మార్ట్‌ఫోన్ సేల్స్‌లొ ఎక్కువ సంఖ్యలో ఈఎంఐలపైనే విక్రయించబడుతున్నాయి. పెద్ద బ్రాండ్ కంపెనీలు కూడా ఫోన్ విక్రయాలపై పెద్ద డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయి. కానీ ఈఎంఐల వలన బ్యాడ్ లోన్లు (మొండి బకాయిలు) కూడా పెరిగాయి. చాలామంది ఫోన్ తీసుకొని సమయానికి ఈఎంఐ చెల్లించడం లేదు. ఇలాంటి కేసులు నిరోధించడానికి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కొత్త నియమాన్ని పరిగణిస్తోంది. అనుసరించినట్లయితే, ఈఎంఐ పేమెంట్లను చెల్లించని వారి ఫోన్లను కంపెనీలు లేదా బ్యాంక్‌లు లాక్ చేయగలవు.

RBI ప్రతిపాదన ఏమిటి?
ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. RBI తన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌ని కొత్త మార్పులతో అప్డేట్ చేయాలని యోచిస్తోంది. ఇదే జరిగితే.. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ల ద్వారా తీసుకున్న ఫోన్లను రిమోట్గా లాక్ చేయడానికి అనుమతిస్తుంది. దీని అర్థం సరైన సమయంలో ఈఎంఐ పేమెంట్‌ని మిస్ చేస్తే, లెండర్లు (అప్పు ఇచ్చిన వారు) డివైస్‌ని లాక్ చేయగలవు. ఈ ప్రతిపాదనకు సంబంధించి ఆపరేషనల్, లీగల్ ఎథికల్ పరిణామాలను RBI అధ్యయనం చేస్తోంది.


కొత్త పాలసీ వెనుక కారణం
RBI కొత్త ఫ్రేమ్‌వర్క్ కన్‌జూమర్ లోన్ విభాగంలో నాన్-పర్ఫామింగ్ అసెట్స్ (మొండి బకాయిలు) పెరగడాన్ని పరిష్కరించడానికి రూపొందించబడింది. భారతదేశంలో వినియోగదారుల లోన్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో వేగంగా విస్తరించింది. అయితే అదే స్థాయిలో ఈఎంఐ డిఫాల్ట్‌లు కూడా పెరిగాయి. ₹1 లక్ష కంటే తక్కువ ఉన్న చిన్న లోన్లపై ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఈఎంఐ-ఆధారిత ఎలక్ట్రానిక్స్ విక్రయాలపై ఇది ప్రభావం చూపుతుంది.

RBI కొత్త ఫ్రేమ్‌వర్క్ ఎలా అమలు చేస్తుంది?
ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ సవరించడానికి RBI ఎదురుచూస్తోంది. టెక్నికల్ ఫోన్-లాకింగ్ ప్రాసెస్ ఎలా పని చేయాలో కొత్త సూచనలు జారీ చేస్తుంది. అప్లికేషన్ల ప్రైవెసీ, డేటాను రక్షించడానికి, లాకింగ్ ఆప్షన్‌ను ప్రారంభించే ముందు కస్టమర్ల నుంచి ముందస్తు సమ్మతిని పొందడాన్ని RBI తప్పనిసరి చేయడానికి ఎదురుచూస్తోంది. కానీ ఫోన్లో ఏ వ్యక్తిగత డేటాను బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు యాక్సెస్ చేయడానికి అనుమతించబడవు.

కొత్త నియమాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి?
ఈ ప్రాసెస్ దుర్వినియోగం గురించిన ఫిర్యాదుల తర్వాత 2024లో ఫోన్-లాకింగ్ యాప్లను ఉపయోగించడం నిలిపివేయమని RBI ముందు లెండర్లను కోరింది. అయితే, లెండర్లతో తాజా సంప్రదింపుల తర్వాత.. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఈ ఫీచర్‌ని మళ్లీ ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈసారి మరింత కఠినమైన రక్షణ చర్యలతో మార్పుచేయబడిన మార్గదర్శకాలను రాబోయే మరి కొన్ని నెలల్లో అమలు చేయడానికి ఎదురుచూస్తున్నారు.

ఎవరు ప్రభావితమవుతారు?
RBI పాలసీతో ముందుకు వెళితే.. ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయడానికి ఈఎంఐలపై ఆధారపడి ఉన్న మిలియన్ల భారతీయులు ప్రభావితమవుతారు. ప్రస్తుతం భారతదేశంలో 1.16 బిలియన్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. లెండర్లకు ఈ పాలసీ ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, వినియోగదారుల సమూహాలు ఈ కొత్త నియమాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఫోన్లను లాక్ చేయడం వలన తక్కువ ఆదాయం ఉన్న వారు అన్యాయంగా ప్రభావితమవుతారని విమర్శకులు వాదిస్తున్నారు.

Also Read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నకిలి ఐఫోన్ డెలివరీ? ఈ జాగ్రత్తలు పాటించండి

Related News

Jio prepaid offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. AI, OTT బెనిఫిట్స్ తో 6 చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ వచ్చేశాయ్!

Spotify – WhatsApp: Spotify సాంగ్స్ నేరుగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు, ఎలాగంటే?

Social Media Hackers: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సమయం గడిపే వారికి వార్నింగ్.. సైబర్ దొంగల టార్గెట్ మీరే

OnePlus 15: రిలీజ్ కు రెడీ అయిన వన్‌ ప్లస్ 15.. స్పెసిఫికేషన్లు చూస్తే షాకవ్వాల్సిందే!

Humanoid Robot: ఇంటి పనులు చకచకా చేసే రోబో వచ్చేసింది.. ధర కూడా అందుబాటులోనే

Big Screen Iphone Discount: అతి పెద్ద స్క్రీన్‌గల ఐఫోన్‌పై రూ.43000 డిస్కౌంట్.. రిలయన్స్ డిజిటల్‌లో సూపర్ ఆఫర్

Vivo Y500 Pro: కేవలం రూ.22400కే 200MP కెమెరా.. మిడ్ రేంజ్‌‌లో దూసుకొచ్చిన కొత్త వివో ఫోన్

Earthquakes Himalayas: భారత్ లో భూకంపాల రహస్యం బట్టబయలు.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు

Big Stories

×