Flipkart Delivery Scam| ఇటీవలి కాలంలో అందరూ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్ కొనుగోలు చేయడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పై ఆధారపడుతున్నారు. అయితే ఇక్కడ ఆర్డర్ చేస్తే డెలివరీ సమయంలో కొన్నిసార్లు మోసం జరుగుతున్నట్లు తెలిసింది. తాజాగా ఒక షాకింగ్ కేస్ బయటపడింది. ఒక కస్టమర్ బ్రాండ్ న్యూ HP ల్యాప్టాప్ ఆర్డర్ చేశాడు. కానీ ఫ్లిప్కార్ట్ అతనికి రిఫర్బిష్డ్ యూనిట్ (సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్) డెలివరీ చేసింది. ఈ మోసం గురించి ఫిర్యాదు చేసినా ఫ్లిప్కార్ట్ లేదా HP నుంచి తక్షణ సహాయం రాలేదని చెప్పాడు. ఆన్లైన్లో జరిగిన ఘటన గురించి పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
మోసపోయిన కస్టమర్ తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లింక్డ్ఇన్లో డీటెయిల్డ్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ త్వరలో ఇతర యూజర్ల దృష్టిని ఆకర్షించింది. గతంలో చాలా మంది ఇలాగే మోసపోయారని తెలిపాడు. ఇతరుల ఉదాహరణ కూడా చెప్పాడు. పోస్ట్ వైరల్ అయిన తర్వాత ఫ్లిప్ కార్ట్ కస్టమర్ సపోర్ట్ టీమ్స్ స్పందించాయి.
కస్టమర్ అంకిత్ త్రిపాఠి HP Victus (హెచ్పీ విక్టస్) గేమింగ్ ల్యాప్టాప్ ఆర్డర్ చేశాడు. ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేశాడు. ల్యాప్టాప్ ధర రూ.64,700. కొత్త ల్యాప్టాప్ కోసం ఫుల్ అమౌంట్ చెల్లించాడు. కానీ డెలివరీ అయిన ల్యాప్టాప్ చూసి షాకైపోయాడు. అది కొత్త ల్యాప్ టాప్ కాదు. రిఫర్బిష్డ్ లాప్టాప్ అంటే పాతది.
ల్యాప్టాప్ వారంటీ యాక్టివేట్ చేసే సమయంలో కస్టమర్ అది కొత్త ల్యాప్ టాప్ కాదని తెలుసుకున్నాడు. హెచ్పీని కాంటాక్ట్ చేసి డివైస్ వారంటీ రిజిస్టర్ చేయాలని అడిగాడు. హెచ్పీ ఈమెయిల్ ద్వారా రిప్లై ఇచ్చింది. డివైస్ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత అది రిఫర్బిష్డ్ హెచ్పీ కస్టమర్ కేర్ చెప్పింది. రిఫర్బిష్డ్ యూనిట్లకు స్టాండర్డ్ వారంటీ కవరేజ్ ఉండదని తెలిపింది. అది విని అంకిత్ ఆందోళన చెందాడు.
హెచ్పీ నుంచి వచ్చిన ఈమెయిల్ను కస్టమర్ అంకిత్ ఫ్లిప్కార్ట్ సపోర్ట్కు షేర్ చేశాడు. ఫ్లిప్కార్ట్ అదనపు డాక్యుమెంట్స్ అడిగింది. జాబ్ షీట్ లేదా డినైల్ లెటర్ ఇవ్వమని చెప్పింది. కస్టమర్ దగ్గర అలాంటి డాక్యుమెంట్స్ మొదట్లో లేవు. దీంతో సమస్య పరిష్కారం మరింత ఆలస్యమైంది.
కస్టమర్ మళ్లీ హెచ్పీని కాంటాక్ట్ చేశాడు. హెచ్పీ అథారైజ్డ్ సర్వీస్ సెంటర్కు వెళ్లమని సలహా ఇచ్చింది. దీంతో కస్టమర్ విసిగిపోయాడు. హెచ్పీ, ఫ్లిప్కార్ట్ సపోర్ట్కు చాలా సార్లు సమస్య గురించి వివరిస్తూ ఈమెయిల్స్ పంపాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదు.
కస్టమర్ చివరికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు మారాడు. స్క్రీన్షాట్స్, కేస్ డీటెయిల్స్ పబ్లిక్గా షేర్ చేశాడు. పబ్లిక్ పోస్ట్ తర్వాత కంపెనీలు సమస్యని గుర్తించాయి. హెచ్పీ, ఫ్లిప్కార్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పాయి. సాధ్యమైన త్వరగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాయి.
Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో
ఇలాంటి కేస్ ఆన్లైన్లో ఇదే మొదటిది కాదు. చాలా మంది కస్టమర్లు గతంలో తప్పుడు వస్తువుల డెలివరీల గురించి ఫిర్యాదు చేశారు. కొందరు ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరేదో చీప్ ఐటెమ్ రిసీవ్ చేసుకున్నట్లు తెలిపారు. ఖరీదైన స్మార్ట్ఫోన్స్ ఆర్డర్ చేస్తే బ్రిక్స్, సోప్ బార్స్, డ్యామేజ్డ్ గూడ్స్ వచ్చినట్టు చెప్పారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి దిగ్గజ ప్లాట్ఫామ్స్ స్పెషల్ సేల్ ఈవెంట్స్ సమయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
కస్టమర్లు సరైన సపోర్ట్ను చేరుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల నుంచి స్పందన ఆలస్యమవుతోంది. రిపీటెడ్ డాక్యుమెంట్ రిక్వెస్ట్స్ వస్తాయి. ఇది ఫ్రస్ట్రేషన్, ట్రస్ట్ లాస్కు దారి తీస్తుంది. అందుకే సోషల్ మీడియాలో తమ గోడు చెప్పుకుంటున్నారు.
ఇలాంటి మోసాలను నిరోధించడానికి చాలా కఠిన క్వాలిటీ చెక్స్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్లాట్ఫామ్లు షిప్పింగ్ ముందు ప్రొడక్ట్స్ వెరిఫై చేయాలి. రిఫర్బిష్డ్ ఐటెమ్స్ క్లియర్గా లేబుల్ చేయాలి. కస్టమర్లకు ట్రాన్స్పరెన్సీ, క్విక్ రిజల్యూషన్స్ దక్కాలి. ఇలాంటి కేసులు బ్రాండ్ రెప్యూటేషన్ను భారీగా డ్యామేజ్ చేస్తాయి.