RCB-Aryaman Birla: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ప్రారంభం కంటే ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ ( Aditya Birla Group ) సొంతం చేసుకుంది. బెంగళూరు జట్టును ఏకంగా రూ.16,706 కోట్లకు కొనుగోలు చేశారు. ఆదిత్య బిర్లా గ్రూప్ తో పాటు మరో ముగ్గురు కూడా ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు షేర్లను కొనుగోలు చేశారు. ఈ మేరకు దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలోనేఆదిత్య బిర్లా గ్రూప్ బాస్ ఆర్యమన్ బిర్లా, ఇకపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛైర్మన్ గా కొనసాగనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ చైర్మన్ ఆర్యమన్ బిర్లా ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ తో పాటు TOI గ్రూప్, బ్లాక్ స్టోన్, డేవిడ్ బ్లిట్జర్ మూడు కంపెనీలు కూడా బెంగళూరుకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేశాయి. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ ధర పలికింది. 1.78 బిలియన్ డాలర్స్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఈ నాలుగు కంపెనీలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే 2025 సంవత్సరంలో ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై రూ.16,706 కోట్లు పెట్టి, ఈ నాలుగు కంపెనీలు సొంతం చేసుకున్నాయి. ఇందులో మెజారిటీ షేర్లు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ చైర్మన్ ఆర్యమన్ బిర్లా కొనుగోలు చేశారు. దీంతో రాయల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆర్యమన్ బిర్లా చైర్మన్ కాబోతున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దీంతో డియోగో కంపెనీకి, ఆర్సీబీకి బంధం తెగిపోయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చైర్మన్ కాబోతున్న ఆర్యమన్ బిర్లా పెద్ద వ్యాపారస్తుడే కాదు గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. రంజిత్ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టు తరఫున ఆడిన ఆర్యమన్ బిర్లా, గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు. కుమార్ మంగళం బిర్లా కుమారుడైన ఆర్యమన్ బిర్లా, ఇప్పుడు బిజినెస్ లోనే కొనసాగుతున్నాడు. ఆదిత్య బిర్లా గ్రూప్ లో సిందాల్కో, గ్రాసింగ్ లాంటి పెద్ద సంస్థలకు డైరెక్టర్ గా కూడా ఉన్నాడు. ఇక ఇప్పుడు బెంగళూరు జట్టును కొనుగోలు చేసిన నేపథ్యంలో చైర్మన్ గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు ఆర్యమన్ బిర్లా. ఇక రూ.1,75,000 కోట్లకు ఆర్యమన్ బిర్లా వారసుడు అని చెబుతున్నారు.
🚨 ARYAMAN BIRLA – CHAIRMAN OF RCB. 🚨
2018 – Aryaman Birla was part of RR squad.
2026 – Aryaman Birla will serve as RCB’s Chairman. (TOI). pic.twitter.com/gx9K249YaV
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2026
🚨 BREAKING: A new era begins for RCB! 🔴💨
The Royal Challengers Bengaluru franchise has been SOLD for a record-breaking ₹16,706 Crore ($1.78B) to a powerhouse consortium! 🏏💰
🤝 The New Owners:
1️⃣ Aditya Birla Group (Aryaman Birla as Chairman)
2️⃣ TOI Group (Satyan Gajwani… pic.twitter.com/JUnbnAUTBM— Cricket Central (@CricketCentrl) March 24, 2026