Mohammed Siraj: దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయిన బాధలో ఉన్న తెలంగాణ డీఎస్పీ, టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు (mohammed siraj) ఘోర అవమానం ఎదురయింది. గౌహతి విమానాశ్రయంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను ఎయిర్ ఇండియా విమాన సంస్థ అవమానించింది. సరైన సమయానికి ఎయిర్ ఇండియా విమానం రాలేదని తెలుస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా విమాన సంస్థపై ( Air India Express) షాకింగ్ పోస్టు కూడా పెట్టారు మహమ్మద్ సిరాజ్. ఇది అత్యంత దారుణమంటూ మహమ్మద్ సిరాజ్ సోషల్ మీడియా వేదికగా తన బాధను వెళ్లగక్కాడు. గంటల కొద్దీ విమానాశ్రయంలో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఎమోషనల్ అయ్యారు. ఇలా ప్రయాణికుల పట్ల ఇండియా విమాన సంస్థ వ్యవహరిస్తే ఎలా అంటూ నిలదీశారు.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ్టితో రెండు టెస్టుల సిరీస్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ నేపథ్యంలో దారుణంగా టీమిండియా ఓడిపోయింది. దీంతో నిరాశ చెందిన టీమిండియా ప్లేయర్లు తమ ఇంటికి ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగానే మహమ్మద్ సిరాజ్ కూడా గౌహతి నుంచి హైదరాబాద్ బయలు దేరారు. సాయంత్రం 7:25 గంటలకు ఎయిర్ ఇండియా విమానాన్ని బుక్ చేసుకున్నారు మహమ్మద్ సిరాజ్. దానికి తగ్గట్టుగానే గౌహతిలోని విమానాశ్రయానికి మహమ్మద్ సిరాజ్ చేరుకున్నాడు. మ్యాచ్ పూర్తి కాగానే వెంటనే బయలుదేరాడు. అయితే మహమ్మద్ సిరాజ్ విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత, ఎయిర్ ఇండియా విమానం ఆలస్యంగా రాబోతున్నట్లు ప్రకటించారట.
దీనిపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని మహమ్మద్ సిరాజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి సీరియస్ అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు విమానాశ్రయంలో టైం వేస్ట్ చేయించారని మండిపడ్డారు మహమ్మద్ సిరాజ్. నాలాంటి సెలబ్రిటీలకే ఇలా అవమానం జరిగితే? సామాన్యులు ఎలా అంటూ నిప్పులు చెరిగారు. మరి దీనిపై ఎయిర్ ఇండియా విమాన సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd Test ) మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మనోళ్లకు గోర అవమానం జరిగింది. రెండు టెస్టులు ఆడితే రెండింటిలో కూడా టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఓడిపోవడమే కాకుండా 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కూడా దక్షిణాఫ్రికా చేతిలో కోల్పోయింది మన టీమ్ ఇండియా. అది కూడా స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ కావడం గమనార్హం. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Air India flight no IX 2884 from Guwahati to Hyderabad was supposed to take off at 7.25 however there has been no communication from the airline and after repeatedly following up, they have just delayed the flight with no proper reasoning. This has been really frustrating and…
— Mohammed Siraj (@mdsirajofficial) November 26, 2025