E-Paper
Advertisement

కోహ్లీ దుర్మార్గుడు..అంబ‌టి, యువ‌రాజ్ సింగ్ ల‌ కెరీర్ నాశ‌నం చేశాడు

కోహ్లీ దుర్మార్గుడు..అంబ‌టి, యువ‌రాజ్ సింగ్ ల‌ కెరీర్ నాశ‌నం చేశాడు
Advertisement

Amit Mishra On Virat Kohli :  టీమిండియా ఒకప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీని (Virat Kohli) ఉద్దేశించి అమిత్ మిశ్రా (Amit Mishra) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చాలా మంది ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని బాంబు పేల్చారు. జట్టులో నుంచి ఎందుకు తొలగిస్తున్నారో? ఎందుకు కొత్త వాళ్లను తీసుకుంటున్నారు? అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా విరాట్ కోహ్లీ వ్యవహరించాడని అమిత్ మిశ్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. దాని వల్ల చాలా మంది సీనియర్ క్రికెటర్లకు అన్యాయం జరిగిందని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. కోహ్లీ వ్య‌వ‌హారం వ‌ల్ల‌, స‌ద‌రు క్రికెట‌ర్ల కెరీర్లు నాశ‌నం అయిన‌ట్లు గుర్తు చేశారు. దీంతో అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

కోహ్లీ దుర్మార్గుడు..అంబ‌టి, యువ‌రాజ్ సింగ్ ల‌ కెరీర్ నాశ‌నం చేశాడు

అమిత్ మిశ్రా… మహేంద్ర సింగ్ ధోనీ సమయంలోనే జట్టులోకి వచ్చి అత్యుత్తమ బౌలర్ గా ఎదిగారు. అనిల్ కుంబ్లే తరహాలో టీమిండియా జట్టులో కొనసాగుతూ ఎన్నో వికెట్లు పడగొట్టాడు మిశ్రా. అలాంటి మిశ్రా ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ లీడ్ చేస్తూ.. రిలాక్స్ అవుతున్నారు. అలాంటి అమిత్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని… మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ ని మెచ్చుకుంటూ… విరాట్ కోహ్లీని కించపరుస్తూ మాట్లాడారు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చాలా మంది యంగ్ క్రికెటర్లకు అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ కెరీర్లు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ధోని అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

చివ‌రి క్ష‌ణంలో అంబటి రాయుడుని త‌ప్పించారు

2019 వరల్డ్ కప్ సమయంలో అంబటి రాయుడు స్థానం ఖరారు కాగా… వరల్డ్ కప్ కిట్స్ కూడా అతని ఇంటికి పంపించారు. కానీ చివరి క్షణంలో అతనిని దుర్మార్గంగా తప్పించారని ఫైరయ్యారు అమిత్ మిశ్రా. దీనిపై కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గం అన్నారు. అలాగే ఇదే టోర్నమెంట్ నేపథ్యంలో యువరాజు సింగ్ కు కూడా అవకాశం ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరించాలని ఫైర్ అయ్యారు. ఈ ఇద్దరు విషయంలో విరాట్ కోహ్లీ ఒక్క మాట మాట్లాడకుండా జట్టులో నుంచి తొలగించారని సీరియస్ అయ్యారు.

Advertisement

తన విషయంలో కూడా చాలా సార్లు విరాట్ కోహ్లీ ఇలాగే వ్యవహరించాడని మండిపడ్డారు. ఒక ప్లేయర్ ను జట్టు నుంచి తొలగిస్తున్నామంటే.. కెప్టెన్ గా బాధ్యతాయుతంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చురకలు అంటించారు. కానీ రవి శాస్త్రి అటు విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి అప్పట్లో దుర్మార్గంగా వ్యవహరించి జట్టును కుదేలు చేశారని ఫైర్ అయ్యారు. అందుకే 2019 వరల్డ్ కప్ లో టీమిండియా ఓడిపోయిందని గుర్తు చేశారు.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

Related News

నా ముందు గిల్ క్రిస్ట్, హేడెన్, ఏబీ డివిలియర్స్ పిల్ల బ‌చ్చాగాళ్లు

నా బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చి, గంగూలీ టార్చ‌ర్ చేశాడు

పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌కలం…రిజ్వాన్‌, ఇమామ్ ల‌పై బ్యాన్ ?

పాకిస్తాన్ క్రికెట్ వెంటిలేటర్‌పై నడుస్తోంది..ఏ క్ష‌ణ‌మైనా ఊపిరిపోతుంది

పాకిస్తాన్ హెడ్ కోచ్ గా గౌత‌మ్ గంభీర్‌…? ఇక టీమిండియా జ‌ట్టుకు న‌ర‌క‌మేనా !

పాకిస్తాన్ తో టీమిండియాకు బ‌ల‌వంతంగా పెట్టొద్దు…గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆసియా క‌ప్ ఆడ‌ట‌మే దండ‌గ..ట్రోఫీ గెలిచినా న‌ఖ్వీగాడు లేపేస్తాడు!

Big Stories

Advertisement
×