Match Fixing In Pakistan Team : ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ (Fixing) కలకలం తెరపైకి వచ్చింది. గతంలో చాలా సార్లు పాకిస్తాన్ క్రికెటర్లు ఫిక్సింగ్ పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ అదే అంశం తెరపైకి వచ్చింది. ఇంగ్లాండ్ వాళ్లకు పాకిస్తాన్ క్రికెటర్లు అమ్ముడు పోయినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గుర్తించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రెండు రోజుల కిందట ఇంగ్లాండ్ గడ్డపై పర్యటించిన పాకిస్తాన్ క్రికెటర్ల మొబైల్ ఫోన్స్ (PCB took mobile phones ) లాగేసుకుంది PCB. అందరి మొబైల్స్ తీసుకున్న తర్వాత విచారణ షురూ చేసింది. అయితే ఈ విచారణలో మహమ్మద్ రిజ్వాన్ తో ( mohammed Rizwan) పాటు ఇమామ్ ఉల్ హక్ (Imam-ul-Haq) పేర్లు తెరపైకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇంగ్లాండ్ గడ్డపై మూడు టెస్టుల సిరీస్ కోసం పాకిస్తాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే రెండు టెస్టుల్లో వరుసగా పాకిస్తాన్ ఓడిపోయింది. మూడో టెస్టులో కూడా ఓడిపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్ల ప్రదర్శన పై అనుమానాలు వ్యక్తం చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్లేయర్లకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ సీజ్ చేసింది పీసీబీ. అయితే ఇందులో మహమ్మద్ రిజ్వాన్ తో పాటు ఇమామ్ ఉల్ హాక్ ఇద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు గుర్తించారట. వీళ్ళ మొబైల్స్ పరిశీలించగా… ఫిక్సింగ్ కు పాల్పడినట్లు గుర్తించారని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఏంటో తెలియదు కానీ.. ప్రచారం అయితే సాగుతోంది.
ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెళ్లి, మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ లపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ ఇద్దరి మొబైల్స్ ను క్షుణ్ణంగా విచారిస్తోంది. ఒకవేళ ఈ ఇద్దరూ తప్పు చేసినట్లు తేలితే మాత్రం, యాక్షన్ తీసుకోనున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఐసీసీ కూడా రంగంలోకి దిగి, పర్మినెంట్ బ్యాన్ విధించే ప్రమాదం ఉంది.
ఇంగ్లాండ్ గడ్డపై మహమ్మద్ రిజ్వాన్ ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడలేదు. కావాలని అవుట్ అయినట్లుగా అతని ప్రదర్శన స్పష్టంగా కనిపిస్తోంది. అటు ఇమామ్ ఉల్ హాక్ కూడా రెండో టెస్టులో తుది జట్టులో ఉండి కూడా గాయం పేరుతో డ్రామాలు ఆడాడు. ఇలాంటి నేపథ్యంలోనే ఇద్దరు పై అనుమానాలు వ్యక్తం చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… లోతుగా విచారణ చేస్తోంది. దోషులుగా తేలితే కచ్చితంగా చర్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.