E-Paper
Advertisement

గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్

గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్
Advertisement

Ananya Birla:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఫైనల్స్ రేపు జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య ఈ మ్యాచ్ ఉండనుంది. రేపు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ షురూ అవుతుంది. అయితే ఇలాంటి క్రమంలో ఐపీఎల్ 2026 ఫైనల్స్ పై సంచలన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య ఫైనల్స్ జరగాలని ముందే ఫిక్స్ అయిందని, సంచలన ఆరోపణలు వస్తున్నాయి. బెంగళూరు కొత్త ఓనర్ అనన్య బిర్లా (Ananya Birla) చేసిన పాత పోస్టు వైరల్ చేస్తూ, ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

Also Read: RR VS SRH Eliminator Match: వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

గుజరాత్ వర్సెస్ RCB మధ్య ఫైనల్స్.. ముందే ఊహించిన అనన్య

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో ( Indian Premier League 2026 Tournament) గుజరాత్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడతాయని అనన్య బిర్లా ముందే ఊహించినట్లు తాజాగా ఓ పోస్టు వైరల్ గా మారింది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభ దశలో అనన్య బిర్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫైనల్స్ లోకి రావాలన్నది తన డ్రీమ్ అని ఆమె వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు. అయితే ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు అదే రెండు జట్లు ఫైనల్స్ కు వచ్చాయి. దీంతో అనన్య బిర్లా చెప్పింది జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై మరి కొంత మంది విష ప్రచారం చేస్తున్నారు. ఫైనల్స్ ముందే ఫిక్స్ అయిందని… అనన్య బిర్లా ఫ్యామిలీకి సంబంధించిన రెండు జట్లు ఫైనల్స్ కు వచ్చినట్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఫిక్సింగ్ అని ఫైర్ అవుతున్నారు.  ఐపీఎల్ లో జరిగే ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్ అని ఫ్రూఫ్స్‌తో ఫోటోలను వైర‌ల్ చేస్తున్నారు.

గుజ‌రాత్ టైటాన్స్ కు ఆదిత్యా బిర్లా గ్రూప్ న‌కు ఏం సంబంధం ?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ నకు గుజరాత్ టైటాన్స్ కు కూడా సంబంధం ఉంది. ఈ సీజన్ నుంచే ఆదిత్య బిర్లా గ్రూప్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. గుజరాత్ జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా ఆదిత్య బిర్లా గ్రూప్ వ్యవహరిస్తోంది. అందుకే గుజరాత్ టైటాన్స్ జెర్సీ పైన బిర్లా ఎస్టేట్స్ అని రాసి ఉంటుంది. డ్రీమ్ 11 పైన బ్యాన్ విధించిన నేపథ్యంలో ఆస్థానాన్ని బిర్లా ఎస్టేట్స్ భర్తీ చేసుకుంది. అందుకే ఐపీఎల్ ప్రారంభాని కంటే ముందు గుజరాత్ టైటాన్స్ జెర్సీని అనన్య బిర్లా ఆధ్వర్యంలోనే లాంచ్ చేశారు. ఇక ఈ సంవత్సరమే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కూడా ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసింది. అంటే ఫైనల్స్ లో ఎవరు గెలిచినా ఆదిత్య బిర్లా గ్రూప్ నకు అడ్వాంటేజ్ అవుతుంది.

Advertisement

Also Read:  RR VS SRH Eliminator Match: 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం, క‌న్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప‌? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×