Ashwin: టీమిడియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్ ను ఎప్పటిలాగే టీమ్ ఇండియా ప్రదర్శన కనబరుస్తోంది. ఏ ఒక్క ప్లేయర్ సరిగ్గా రావడం లేదు. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా… మిగిలిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది టీమిండియా. ఇక రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. అయితే మూడవ టి20 లో 76 పరుగులకు ఆల్ అవుట్ కావడంపై రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) ఫైర్ అయ్యారు. అనవసరంగా టీ20 ప్లేయర్, వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను పక్కకు పెట్టి గౌతమ్ గంభీర్ తప్పు చేశాడని ఆగ్రహించారు. వైభవ్ కోసం సంజు శాంసన్ ను బలి చేస్తారా ? అని నిలదీశారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆగ్రహించారు. గంభీర్ అసలు నీకు బుర్ర ఉందా? సంజును కాకుండా ముందు నీ శిష్యులను తీసేయ్ అంటూ రవి చంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టి20 సిరీస్ సందర్భంగా టీమిండియా ఇప్పటికే రెండు టీ20 లు ఓడిపోయింది. ఈ క్రమంలో నాలుగవ టి20 నుంచి కచ్చితంగా సంజు శాంసన్ ను తీసుకోవాల్సిందేనని రవిచంద్రన్ అశ్విన్ డిమాండ్ చేశారు. అతడు కేవలం టి20 ఫార్మాట్ ఆడుతున్నాడని… అలాంటి వాడికి రెస్ట్ ఇస్తే ఎలా అంటూ నిలదీశారు. జింబాబ్వే టూర్ లో కూడా రెస్ట్ పేరుతో సంజు శాంసన్ ను పక్కకు పెట్టడం బుర్ర తక్కువ పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా టీమిండియాలో చాలామంది ప్లేయర్లు ఉంటున్నారని… వాళ్లను తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇలా చాలా మంది క్రికెటర్లు ఉన్నారని.. సంజు కంటే దారుణంగా వాళ్ళు వాడుతున్నారని గుర్తు చేశారు.
అలాంటప్పుడు వాళ్లపైన పడని వేటు… సంజు శాంసన్ పైన ఎందుకు వేసారని ప్రశ్నించారు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా టీమిండియాను ఛాంపియన్ నిలపడంలో సంజు శాంసన్ సేవలు ఎనలేనివి అంటూ వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు వరల్డ్ కప్ తెచ్చిన హీరోలు వదిలి… 15 ఏళ్ల కుర్రాడి చుట్టూ తిరగడం తెలివి తక్కువ తనం అంటూ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గౌతమ్ గంభీర్ అసలు విషయం తెలుసుకొని… సంజు శాంసన్ కు టి20 ఫార్మాట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పరోక్షంగా టెస్ట్ ప్లేయర్ గా ట్రోలింగ్ ఎదుర్కొంటున్న తిలక్ వర్మను పక్కకు పెట్టాలని అశ్విన్ సూచనలు చేశాడు.