Case on Virat Kohli Pub: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కొనసాగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పబ్ పైన కేసు నమోదు అయింది. బెంగళూరులోని కోహ్లీ యజమానిగా ఉన్న పబ్ పైన కేసు నమోదు చేశారు. బెంగళూరులో కోహ్లీ యజమానిగా ఉన్న వన్ 8 కమ్యూన్ పబ్బు పైన సుమోటాగా కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ లో స్మోకింగ్ ఏరియా లేదని… ‘కోట్పా’ చట్టం కింద… కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.
Also Read: Priyansh Arya football: వాళ్ళు తన్నడం, వీడు తన్నించుకోవడం…అందరూ సరిపోయారు.. పిల్ల బచ్చాను చేసి
ఈ మేరకు కోహ్లీకి నోటీసులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో బిజీగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఆ నోటీసులను… కోహ్లీ బిజినెస్ చూసుకునే మేనేజర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. దీనిపై… కోహ్లీ టీం స్పందించి.. రెస్టారెంట్ లో స్మోకింగ్ ఏరియా ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కోహ్లీ రెస్టారెంట్ పైన కేసు నమోదు కావడంతో… ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫైనల్స్ కు దూసుకు వెళ్లిన కోహ్లీ టీం
విరాట్ కోహ్లీ హోటల్ పై కేసు విషయం పక్కకు పెడితే… ప్రస్తుతం రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు… ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ బిజీలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team) రాణించింది. ఈ నేపథ్యంలోనే మొన్న క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నేరుగా ఫైనల్ కు చేరింది. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ( Indian Premier League 2025 Tournament ) ప్లే ఆఫ్ దాకా వచ్చి… ఇంటికి వెళ్లిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… ఈసారి మాత్రం అదరగొట్టింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు ఫైనల్ చేరింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
ఫైనల్ ఎప్పుడు అంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( Indian Premier League 2025 Tournament ) సంబంధించిన ఫైనల్ మ్యాచ్ మంగళవారం రోజున జరగనుంది. అంటే జూన్ మూడో తేదీన రాయల్ చాలెంజర్స్ వర్సెస్ బెంగళూరు ( IPL 2025, PBKS vs RCB Final Match) మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. మంగళవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.