E-Paper
Advertisement

PCB – IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్.. 30 వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్న పీసీబీ ఛైర్మన్‌!

PCB – IND vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్.. 30 వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్న పీసీబీ ఛైర్మన్‌!
Advertisement

PCB – IND vs PAK: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేటి {ఫిబ్రవరి 19} నుండి ప్రారంభం కాబోతోంది. మరికొద్ది గంటలలోనే పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇక భారత జట్టు ఈ టోర్నీలో గురువారం నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతోంది. బంగ్లాదేశ్ తో భారత్ తన తొలి మ్యాచ్ ని ఆడబోతోంది. ఇక క్రీడాభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఈనెల 23న జరగనుంది.

Also read: Champions Trophy 2025: నేటి నుండే ఛాంపియన్స్ ట్రోఫీ.. టైమింగ్స్ ఇవే, ఫ్రీగా చూడాలంటే ఎలా?

Advertisement

మొత్తం ఎనిమిది జట్ల మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోరులో.. అంతిమంగా ఓ జట్టు ఛాంపియన్ గా నిలవనుంది. ఈ టోర్నీ లో ఎన్ని మ్యాచులు ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న మ్యాచ్ ఏదంటే.. వెంటనే గుర్తొచ్చే మాట ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్. ఈ ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు సాధారణ ప్రేక్షకులతో పాటు ఏవీఐపీలు, రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, ఇతర సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తారు.

ఈ మ్యాచ్ లో గెలిచేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు కూడా తమ ప్రాణాలను పెట్టేస్తుంటారు. అందుకే ఈ ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే అంత క్రేజ్. ఈ నేపథ్యంలోనే ఐసీసీ కూడా దీనిని అద్భుతంగా క్యాష్ చేసుకుంటుంది. ప్రతి ఐసీసీ ఈవెంట్ లో ఈ రెండు జట్లకు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఉండేలా చూసుకుంటుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కి సంబంధించి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్వాహకులు 30 వీఐపీ టికెట్లను ఆఫర్ చేశారు.

Advertisement

అలాగే బీసీసీఐకి కూడా టికెట్లు ఆఫర్ చేశారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మాత్రం తనకు ఆఫర్ చేసిన విఐపి టికెట్లను ఆయన అమ్ముకోవాలని భావిస్తున్నారు. బోర్డు చైర్మన్ అని ఫ్రీగా టికెట్లు ఆఫర్ చేస్తే.. ఇలా అమ్ముకోవడమేంటని అనుకోకండి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆఫర్ చేసిన టికెట్ల ఖరీదు భారత కరెన్సీలో దాదాపు 94 లక్షలు ఉంటుంది.

Also read: BCCI: BCCI కి పెళ్ళాల టార్చర్.. దెబ్బకు వెనక్కి తగ్గారు?

అంత ఖరీదైన టికెట్లను తీసుకుని, వీఐపీ బాక్స్ లో సౌకర్యాలు పొందుతూ భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ చూసే బదులు.. ఆ టికెట్లను అమ్ముకునే వచ్చిన డబ్బుతో పాకిస్తాన్ లోని క్రికెట్ స్టేడియాల అభివృద్ధి కోసం ఉపయోగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు సైతం ఆయన తెలియజేశారు. ఇక తాను సాధారణ ప్రేక్షకులతో కలిసి భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తానని తెలిపారు.

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×