CM Revanth vs Lionel Messi: ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీ మ్యాచ్ ( CM Revanth vs Lionel Messi) ప్రారంభమైంది. సింగరేణి ఆర్ఆర్ టీంలో సీఎం రేవంత్ రెడ్డి ఉండగా అపర్ణ టీంలో లియోనెల్ మెస్సీ ఉన్నాడు. సరిగ్గా 8 గంటల సమయంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ సందర్భంగా రేవంత్ రెడ్డి టీం అద్భుతంగా రాణించింది. వరుసగా రెండు గోల్స్ సాధించింది రేవంత్ రెడ్డి టీం. అనంతరం స్వయంగా లియోనెల్ మెస్సీ గ్రౌండ్ లోకి దిగి మ్యాచ్ ఆడాడు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ లోకి దిగి, గోల్ కూడా కొట్టాడు.
దాదాపు ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ ( Lionel Messi), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) 10 నిమిషాల వరకు ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ లో ఒకటో నెంబర్ జెర్సీ ధరించిన సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి జట్టు తరుపున మైదానంలో సందడి చేశారు. అటు లియోనెల్ మెస్సీ మాత్రం జెర్సీ లేకుండానే అపర్ణ టీం తరఫున బరిలోకి దిగాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత లియోనెల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది.
ఫుట్ బాల్ ను తన స్టైల్ లో రేవంత్ రెడ్డి డీల్ చేస్తే, లియోనెల్ మెస్సీ మాత్రం తన శైలిలో ఆడాడు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల గ్యాలరీ వైపు బంతి పంపారు లియోనెల్ మెస్సీ. ఒకే ఒక్క షాట్ కు బంతి ప్రేక్షకుల గ్రాలరీలోని టాప్ ఎండ్ కు తగిలింది. తదనంతరం, గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్లతో పాటు లియోనెల్ మెస్సీ సరదగా గడిపారు. ఈ సందర్భంగా లియోనెల్ మెస్సీతో ప్లేయర్లు ఫోటోలు కూడా దిగారు. ఇక ఈ లియోనెల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ పండగ వాతావరణం కనిపించింది. వీళ్ల ఫ్రెండ్లీ మ్యాచ్ ను బాగా ఎంజాయ్ చేశారు అభిమానులు.
ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు.. స్టేడియంలోకి దిగిన ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ pic.twitter.com/nNKFJ3NLdv
— PulseNewsBreaking (@pulsenewsbreak) December 13, 2025
గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/Wn2Zpl4fCj
— PulseNewsBreaking (@pulsenewsbreak) December 13, 2025