E-Paper
Advertisement

వ‌రుస ఓట‌ములు, గంభీర్ ను దించేందుకు బీసీసీఐ కిరాక్ ప్లాన్‌..ఆ రాక్ష‌సుడే వ‌స్తున్నాడు ?

వ‌రుస ఓట‌ములు, గంభీర్ ను దించేందుకు బీసీసీఐ కిరాక్ ప్లాన్‌..ఆ రాక్ష‌సుడే వ‌స్తున్నాడు ?
Advertisement

BCCI:  ఐర్లాండ్ సిరీస్ లో వైట్ వాష్ అయిన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో కూడా చిత్తుగా ఓడిపోయింది. 3-0 తేడాతో సిరీస్ కూడా కోల్పోయింది టీమిండియా. ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై (Gambhir) చాలా గుర్రుగా ఉందట బీసీసీఐ (BCCI). ఇందులో భాగంగానే గౌతమ్ గంభీర్ ను బయటకు పంపించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గంభీర్ చేసిన రెండు సంవత్సరాల పదవిపై రివ్యూ చేయాలని డిసైడ్ అయిందట. దీనికోసం గౌతమ్ గంభీర్ శత్రువు మహేంద్రసింగ్ ధోనిని రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోందట బిసిసిఐ. ఈ మేరకు ఇప్పటికే దోనికి కీలక ఆదేశాలు కూడా వెళ్ళినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

వ‌రుస ఓట‌ములు, గంభీర్ ను దించేందుకు బీసీసీఐ కిరాక్ ప్లాన్‌

Advertisement

ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ పై టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్ లు కోల్పోయిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పనితీరుపై రివ్యూ చేయాలని బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. ఇంగ్లాండ్ తో మిగిలిన టి20 ఫినిష్ అయిన తర్వాత ఈ రివ్యూ షురూ అవుతుందని అంటున్నారు. ఓటములకు ట్రాన్సిషన్ ను కారణంగా చెప్పడం సరికాదని బోర్డు భావిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు పరుగులు చేయడంలో విఫలమవుతున్న తిలక్ వర్మాను కూడా సెలెక్టర్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరు సరిగ్గా ఆడలేదో? వాళ్ల అందరి తాట తీసి ఎందుకు రంగం సిద్ధం చేసింది.

రివ్యూ చేసేందుకు రంగంలోకి మహేంద్ర సింగ్ ధోని?

వరుసగా టీమిండియా ఓటములు చవి చూస్తున్న నేపథ్యంలో గంభీర్ ను బాధ్యుడిని చేస్తూ రివ్యూ చేసేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే రివ్యూ చేసే కమిటీ హెడ్ ను మహేంద్ర సింగ్ ధోని నియామకం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని కూడా డ్యూటీ ఎక్కినట్లు సమాచారం. గంభీర్ తాట తీసేందుకు రెడీ అయ్యాడట. నిజంగానే మహేంద్రసింగ్ ధోనీ వస్తే… గౌతమ్ గంభీర్ తో పాటు అతని శిష్యులు కూడా బ్యాగులు సర్దుకోవాల్సిందేనని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

టి20 లో గంభీర్ కు మంచి రికార్డులు

Advertisement

గౌతమ్ గంభీర్ తన పదవీకాలంలో.. టీమ్ ఇండియాకు అనేక విజయాలను టి20 ఫార్మాట్ లో అందించాడు. ఏషియా కప్ 2025, ఛాంపియన్స్ ట్రోఫీ, టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లు కూడా అందించాడు. అలాగే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో పలు టి20 సిరీస్ లు కూడా గౌతమ్ గంభీర్ గెలిపించాడు. అయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయిన తర్వాత రెండు సిరీస్ లు కోల్పోయింది టీమిండియా. దీనికి గంభీర్ చెత్త నిర్ణయాలే కారణం అంటూ… అతన్ని టార్గెట్ చేశారు క్రికెట్ ఫ్యాన్స్. అందుకే ఇప్పుడు బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

 

 

 

Related News

బ్యాటింగ్ చేత‌కాదు కానీ, రౌడీలా ఫైటింగ్ చేస్తున్నాడు

వీల్ చైర్ పై వచ్చైనా రెండో టెస్టులో బాబ‌ర్ ఆజం ఆడాలి

మొద‌టి బంతికే 80 ప‌రుగులు…టీమిండియా క్రికెట‌ర్ స‌రికొత్త రికార్డ్

గ‌జ దొంగ‌ న‌ఖ్వీ ప‌క్క‌న కూర్చోడానికి సిగ్గులేదా ? శుక్లా ప‌రువు తీసిన ఇర్ఫాన్ ప‌ఠాన్‌

సారా ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసే ప్ర‌య‌త్నం… వార్నింగ్ ఇచ్చిన సచిన్ !

లైవ్ మ్యాచ్ లో కండ‌లు చూపించిన ధ్రువ్ జురెల్ బ్యాన్ వేయాల్సిందే !

7500 KMల‌ ప్రయాణం..రూ.10 ల‌క్ష‌ల ఖ‌ర్చు, లిట‌న్ దాస్ వ‌రుస డ‌కౌట్స్ పై ట్రోల్స్‌

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై టీమిండియానే గెలువ‌లేదు..పాకిస్తాన్ ఎలా గెలుస్తుంది

Big Stories

Advertisement
×