BCCI: ఐర్లాండ్ సిరీస్ లో వైట్ వాష్ అయిన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో కూడా చిత్తుగా ఓడిపోయింది. 3-0 తేడాతో సిరీస్ కూడా కోల్పోయింది టీమిండియా. ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై (Gambhir) చాలా గుర్రుగా ఉందట బీసీసీఐ (BCCI). ఇందులో భాగంగానే గౌతమ్ గంభీర్ ను బయటకు పంపించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గంభీర్ చేసిన రెండు సంవత్సరాల పదవిపై రివ్యూ చేయాలని డిసైడ్ అయిందట. దీనికోసం గౌతమ్ గంభీర్ శత్రువు మహేంద్రసింగ్ ధోనిని రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోందట బిసిసిఐ. ఈ మేరకు ఇప్పటికే దోనికి కీలక ఆదేశాలు కూడా వెళ్ళినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ పై టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్ లు కోల్పోయిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పనితీరుపై రివ్యూ చేయాలని బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. ఇంగ్లాండ్ తో మిగిలిన టి20 ఫినిష్ అయిన తర్వాత ఈ రివ్యూ షురూ అవుతుందని అంటున్నారు. ఓటములకు ట్రాన్సిషన్ ను కారణంగా చెప్పడం సరికాదని బోర్డు భావిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు పరుగులు చేయడంలో విఫలమవుతున్న తిలక్ వర్మాను కూడా సెలెక్టర్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరు సరిగ్గా ఆడలేదో? వాళ్ల అందరి తాట తీసి ఎందుకు రంగం సిద్ధం చేసింది.
వరుసగా టీమిండియా ఓటములు చవి చూస్తున్న నేపథ్యంలో గంభీర్ ను బాధ్యుడిని చేస్తూ రివ్యూ చేసేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే రివ్యూ చేసే కమిటీ హెడ్ ను మహేంద్ర సింగ్ ధోని నియామకం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని కూడా డ్యూటీ ఎక్కినట్లు సమాచారం. గంభీర్ తాట తీసేందుకు రెడీ అయ్యాడట. నిజంగానే మహేంద్రసింగ్ ధోనీ వస్తే… గౌతమ్ గంభీర్ తో పాటు అతని శిష్యులు కూడా బ్యాగులు సర్దుకోవాల్సిందేనని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.
గౌతమ్ గంభీర్ తన పదవీకాలంలో.. టీమ్ ఇండియాకు అనేక విజయాలను టి20 ఫార్మాట్ లో అందించాడు. ఏషియా కప్ 2025, ఛాంపియన్స్ ట్రోఫీ, టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లు కూడా అందించాడు. అలాగే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో పలు టి20 సిరీస్ లు కూడా గౌతమ్ గంభీర్ గెలిపించాడు. అయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయిన తర్వాత రెండు సిరీస్ లు కోల్పోయింది టీమిండియా. దీనికి గంభీర్ చెత్త నిర్ణయాలే కారణం అంటూ… అతన్ని టార్గెట్ చేశారు క్రికెట్ ఫ్యాన్స్. అందుకే ఇప్పుడు బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.