Saba Karim Warns Yashasvi Jaiswal: శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం రెండవ టెస్టు జరుగుతోంది. ఈ టెస్టులో దాదాపు టీమిండియా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో టీమిండియా జట్టు గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లే మార్గం సుగమం అవుతుంది. అయితే ఈ రెండు టెస్టు నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal), అసిత ఫెర్నాండో గొడవ మాత్రం చల్లారడం లేదు. కుర్ర క్రికెటర్ యశస్వి జైస్వాల్ చాలా అగ్రేసివుగా మైదానంలో కనిపించిన నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్లే అతని విమర్శిస్తున్నారు. ఇప్పటికే హర్ష భోగ్లే ఈ సంఘటనపై మండిపడగా… సంజయ్ మంజ్రేకర్ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఇక ఈ లిస్టులోకి తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు సబా కరీమ్ (Saba Karim) స్పందించారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలాంటి వివాదాలు చాలా కామన్ అన్నారు. కానీ ఓపికగా అన్ని భరిస్తేనే మహేంద్ర సింగ్ ధోని, సచిన్ స్థాయి ప్లేయర్లుగా మిగులుతారని హితువు పలికారు.
అసిత ఫెర్నాండో, యశస్వి జైస్వాల్ సంఘటన పై టీమిండియా మాజీ ఆటగాడు సబా కరీమ్ (Saba Karim) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా జెర్సీలు ధరించి…. రౌడీల లాగా కొట్టుకుంటున్నారని ఆగ్రహించారు. ఏదైనా ఆవేశం వస్తే… టీమిండియా జెర్సీని తీసేసి పందుల్లా కొట్టుకోవాలని ఫైర్ అయ్యారు. అంతేకానీ టీమిండియాను, జాతీయ జెర్సీని అస్సలు కించపరచకూడదని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే టీం ఇండియాలో ఎదుగుతున్న యశస్వి జైస్వాల్, అవతలివాడు గెలికాడని… రెచ్చిపోతాడా? ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని ఆగ్రహించారు. యశస్వి జైస్వాల్ ఇంకా చాలా మ్యాచ్ లు ఆడాల్సి ఉందని తెలిపారు. కెరీర్ ప్రారంభంలోనే ఇలా గొడవలు పడితే అస్సలు కుదరదు అన్నారు. తేడా వస్తే టీమిండియా నుంచి మెడలు పట్టుకొని గెంటేస్తారని వార్నింగ్ ఇచ్చారు. దీంతో సబా కరీమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మొన్న ఇదే శ్రీలంక గడ్డపై వైభవ్ సూర్యవంశీ కూడా ప్రత్యర్థి ప్లేయర్ ను ఉద్దేశించి రెచ్చిపోయాడు. ఇక ఇప్పుడు మరో శ్రీలంక ఆటగాడిని వాళ్ళ గడ్డపై యశస్వి జైస్వాల్ బెదిరించాడు. అయితే ఈ రెండు సంఘటనల నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ చాలా సీరియస్ అయ్యారు. ఈ ఇద్దరిపై ఐసీసీతో పాటు బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఈ ఇద్దరు వెధవలు గాడిలో పడతారని మండిపడ్డారు. లేకపోతే నాశనం కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు.