Virender Sehwag On Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టిన మహేంద్రుడు… ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలను జట్టుకు అందించాడు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉండి… ఐదు ట్రోఫీలు అందించాడు. ట్రోఫీలు అందించడానికి పుట్టినట్లుగా ధోని వ్యవహారం ఉంటుంది. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని విధ్వంసకర బ్యాటింగ్ గురించి తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. పూణే వర్సెస్ పంజాబ్ మధ్య 2016 సమయంలో మ్యాచ్ జరగగా… చివరి ఓవర్ లో 23 పరుగులు బాది జట్టును గెలిపించాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ మ్యాచ్ గురించి తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుచేసుకొని… ధోనిని మెచ్చుకున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీని ఎప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ తిడతారన్న సంగతి తెలిసిందే. ధోని వల్లే టీమిండియాలో తనకు అవకాశాలు తక్కువ అయ్యాయన్న ఈగో వీరేంద్ర సెహ్వాగ్ లో ఉంది. అయినప్పటికీ తాజాగా మహేంద్ర సింగ్ ధోనీని మెచ్చుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వీరేంద్ర సెహ్వాగ్. 2016 ఐపీఎల్ సందర్భంగా రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ వర్సెస్ తమ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిందని వివరించారు. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ అక్షర్ పటేల్ కు తానే ఇచ్చానని.. ఆ సందర్భంగా ధోని స్ట్రైకింగ్ లో ఉన్నాడని వెల్లడించారు.
చివరి ఓవర్ లో 23 పరుగులు ధోని టీంకు అవసరమని తెలిపారు. అయితే ధోని భయంకరంగా బ్యాటింగ్ చేయబోడని తాను ఊహించుకున్నట్లు గుర్తు చేశారు. కానీ ఓవర్ ప్రారంభమైన తర్వాత ధోని విధ్వంసాన్ని సృష్టించాడని వెల్లడించారు. అతని బ్యాటింగ్ పవర్ కు అక్షర్ పటేల్ ఒక్కడే కాకుండా పంజాబ్ కింగ్స్ ప్లేయర్ లందరూ ప్యాంట్లు తడుపుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకన్నా భయంకరంగా బ్యాటింగ్ చేశాడని వివరించారు. అందుకే మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ కెప్టెన్ అంటూ ప్రశంసించారు.
ధోని స్ట్రైకింగ్ లో ఉండగా అక్షర్ పటేల్ చివరి ఓవర్ వేశాడు. మొదటి బంతి డాట్ అయింది. ఈ క్రమంలో ఐదు బంతుల్లోనే 23 పరుగులు సాధించాల్సిన అవసరం వచ్చింది. ధోనిపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో వైడ్ వేశాడు అక్షర్ పటేల్. దీంతో ఐదు బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడు సిక్సర్, o, ఫోర్, సిక్సర్, సిక్సర్ బాదాడు ధోని. దీంతో పూణె విజయం సాధించింది.