Dhoni Fans : సాధారణంగా క్రికెట్ లో అయినా.. సినిమా రంగంలో అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. క్రికెట్ రంగంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంటుంది. ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా అటు సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. వాస్తవానికి అది సెప్టెంబర్ 24, 2007 టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ట మధ్య తొలి టీ-20 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి బంతి వేసిన శ్రీశాంత్ విజయాన్ని నమోదు చేశాడు. ఆ బాల్ సిక్స్ వెళ్లితే.. పాకిస్తాన్ జట్టుది విజయం.. కానీ శ్రీశాంత్ బౌలింగ్ లో పాకిస్తాన్ బ్యాటర్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.
Also Read : Cricket Indoor stadiums: క్రికెట్… ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు.. అసలు కారణాలు ఇవే
టీమిండియా వరల్డ్ రికార్డు..
దీంతో టీమిండియా తొలి సారిగా టీ-20 వరల్డ్ కప్ సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అప్పుడు భారత జట్టుకి కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించాడు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా టీ-20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా జట్టు గెలుచుకుంది. అది మరే టీమిండియా క్రికెటర్ కి సాధ్యం కాలేదు. ఇక అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలు టాలీవుడ్ హీరోలు టాప్ ప్లేస్ లో కొనసాగారు. ఇక ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి ఒకరి తరువాత మరొకరూ టాప్ హీరోలుగ కొనసాగారు. ఒక్కో సారి ఒక్కో హీరో టాప్ గా కొనసాగడం విశేషం.
వారి కోసం అభిమానుల జోష్..
వాస్తవానికి టీమిండియా క్రికెటర్లు క్రికెట్ ఆడుతున్నారంటే అభిమానులు తండోపతండోపాలు తరలి వస్తుంటారు. కానీ టీమిండియా క్రికెటర్ల ను అడ్డుకోవడం కోసం మరో క్రికెటర్ ని.. పలువురు సినీ హీరోలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పలువురు క్రికెటర్లు తమకు నచ్చిన అభిమాన నాయకుడికి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా వారు తమకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తమ సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి తో ఓ సినిమాలో నటిస్తుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హరిహరవీరమల్లు అనే మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం జులై 24న ఈ చిత్రం పాన్ ఇండియా లేవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అధిక థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఫలితం ఏవిధంగా ఉంటుందో తెలియదు కానీ.. పవన్ పై అభిమానులు రెట్టింపు ఉత్సాహం చూపించడం విశేషం.