E-Paper
Advertisement

Gautam Gambhir: గంభీర్ ఐరెన్ లెగ్..”అరడజన్” సిరీస్ లు కోల్పోయిన టీమిండియా, రాజీనామా చేయాల‌ని బీసీసీఐ ఆదేశాలు!

Gautam Gambhir: గంభీర్ ఐరెన్ లెగ్..”అరడజన్” సిరీస్ లు కోల్పోయిన టీమిండియా, రాజీనామా చేయాల‌ని బీసీసీఐ ఆదేశాలు!

Gautam Gambhir:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్నటి వరకు వన్డే సిరీస్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్ లో టీమిoడియా దారుణంగా ఓడిపోయింది. మొదటి వన్డేలో విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో కూడా ఓడిపోయింది. దీంతో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది టీమిండియా. ఈ ఓటమి నేపథ్యంలో అందరూ గౌతమ్ గంభీర్ ను విలన్ చేసి ఆడుకుంటున్నారు. వెంటనే గౌతమ్ గంభీర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని లాంటి కోచ్ లను రంగంలోకి దింపాలని కోరుతున్నారు.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

అర డజన్ సిరీస్ లు కోల్పోయిన టీమ్ ఇండియా

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి శని పట్టుకున్నట్టుంది. గంభీర్ ఐరన్ లెగ్గు కారణంగా టీమిండియా ఇప్పటివరకు అరడజన్ కు పైగా సిరీస్ లు కోల్పోయింది. మొట్టమొదట శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య జరిగిన వన్డే సిరీస్ జరిగినప్పుడు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఆ సిరీస్ ను కూడా టీం ఇండియా కోల్పోయింది. ఆ తర్వాత సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది ఇండియా. అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా.. బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ ఆడింది. ఇందులో 4-1 తేడాతో సిరీస్ కూడా కోల్పోయింది టీమిండియా. అనంతరం ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను గెలవాల్సింది పోయి డ్రా చేసుకోవడం జరిగింది.

దీంతో డబ్ల్యూటీసి పాయింట్లు పూర్తిగా తగ్గిపోయాయి. లేటెస్ట్ గా ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా.. వన్డే సిరీస్ కోల్పోయింది. ఆ పర్యటన తర్వాత గిల్ ను వన్డే కెప్టెన్గా పర్మినెంట్ చేశాడు గౌతమ్ గంభీర్. అప్పటినుంచి టీవి ఇండియాకు కొత్త కష్టాలు వచ్చాయి. ఇక తాజాగా గిల్ కెప్టెన్సీ లోని టీమిండియా, న్యూజిలాండ్ చేతిలో మరో వన్డే సిరీస్ కోల్పోయింది. ఇలా మొత్తం అరడజన్ సిరీస్ లు కోల్పోయింది టీమిండియా. గౌతమ్ గంభీర్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో టీమిండియా గెలిచిన సిరీస్ ల కంటే ఓడిపోయిన సిరీస్ లు ఎక్కువగా ఉన్నాయి. ఇలాగే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచింగ్ గా కొనసాగితే T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

జ‌న‌వ‌రి 26వ తేదీన బీసీసీఐ స‌మావేశం

జ‌న‌వ‌రి 26వ తేదీన బీసీసీఐ ( BCCI) అత్య‌వ‌సర స‌మావేశం నిర్వ‌హించ‌నుంద‌ట‌. ఈ సంద‌ర్భంగా టీమిండియా ( Team India) ఓటమిపై గంభీర్‌, గిల్ తో బీసీసీఐ పెద్ద‌లు చ‌ర్చించ‌నున్నార‌ట‌. బీసీసీఐ  గుర్రుగా ఉంటే, మాత్రం గంభీర్ (Gambhir) ప‌ద‌వి పోవ‌డం గ్యారెంటీ అంటున్నారు.

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×