E-Paper
Advertisement

Mohsin Naqvi: PCB సొమ్ముతోనే ICC న‌డుస్తోంది, లేక‌పోతే రోడ్డున ప‌డుతుంది

Mohsin Naqvi: PCB సొమ్ముతోనే  ICC న‌డుస్తోంది, లేక‌పోతే రోడ్డున ప‌డుతుంది
Advertisement

Mohsin Naqvi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అంతర్జాతీయంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ నఖ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ గా మార్చబోతున్నట్లు వెల్లడించారు. ఐసీసీ నడిచేది మొత్తం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన డబ్బుల పైన అంటూ బాంబు పేల్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేకపోతే ఐసీసీ రోడ్డున పడేదని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి ఏజ్ ఒక్క‌టే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే

పాకిస్తాన్ ద‌య‌, డ‌బ్బులతోనే ఐసీసీ న‌డుస్తోంది – మొహ్సీన్ న‌ఖ్వీ

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశానికి చెందిన మంత్రివర్యులు మొహ్సీన్ న‌ఖ్వీ గురించి నిత్యం సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అతన్ని టార్గెట్ చేసి చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తారు. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే అలాంటి మొహ్సీన్ న‌ఖ్వీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటు అతిపెద్దదని.. త్వరలోనే అంతర్జాతీయంగా PSL ను నెంబర్ వన్ లీగ్ గా మార్చబోతున్నట్లు వెల్లడించారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సంబంధించిన డబ్బులతోనే ఐసీసీ నడుస్తోందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మొహ్సీన్ న‌ఖ్వీ. ప్రపంచంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా పవర్ఫుల్, బీసీసీఐ ని కూడా సాసిస్తుందని బాంబు పేల్చారు. ఐసీసీని కాపాడిది కూడా తమ క్రికెట్ బోర్డు అన్నారు. ఐసీసీకి దాదాపు 50% లాభాలు తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. అందుకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎవరిని ఫాలో కాదని… తామే డెసిషన్ మేకర్స్ అంటూ వ్యాఖ్యానించారు మొహ్సీన్ న‌ఖ్వీ. దీంతో మొహ్సీన్ న‌ఖ్వీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇండియ‌న్ ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు. వీడికి బుద్ది లేద‌ని, తెలిసి తెలియ‌ని లెక్క‌లు చెప్పి, అంద‌రినీ పిచ్చోళ్ల‌ను చేస్తున్న‌ట్లు మండిప‌డుతున్నారు ఫ్యాన్స్‌.

ఐసీసీ చైర్మన్ గా మొహ్సీన్ న‌ఖ్వీకి ఛాన్స్ ?

Advertisement

ఐసీసీ చైర్మన్ గా మొహ్సీన్ న‌ఖ్వీకి ఛాన్స్ వస్తుందని మొన్నటి నుంచి వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. 2027 డిసెంబర్ వరకు ఐసీసీ బాస్ గా జై షా కొనసాగనున్నాడు. ఆ తర్వాత కొత్త చైర్మన్ వస్తాడు. ఈ నేపథ్యంలోనే అదృష్టం బాగుంటే మొహ్సీన్ న‌ఖ్వీకి అవకాశం వస్తుందని అంటున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ లో ప్రచారం అయితే సాగుతోంది.

Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభ‌వ్ 6 బంతుల్లో ఆరు సిక్స‌రు కొడ‌తాడు

 

 

https://www.facebook.com/photo?fbid=973950412212368&set=a.808612632079481

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×