Vaibhav Suryavanshi is still a kid: టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs Team India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ టి 20 సిరీస్ ( India tour of Ireland, 2026) నేపథ్యంలో నిన్న తొలి మ్యాచ్ జరగగా, చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. ఐర్లాండ్ చేతిలో ఏకంగా 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని (vaibhav suryavanshi) దారుణంగా అవమానించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. వైభవ్ ఇంకా స్కూల్ కు వెళ్లే పిల్లాడు మాత్రమే అంటూ ట్రీట్ చేసింది. జాతీయ గీతం పాడేటప్పుడు, వైభవ్ ముందు పిల్లాడిని ఎవరిని నిలబెట్టలేదు ఐసీసీ. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని ఐసీసీ అవమానించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs Team India) మధ్య టి20 సిరీస్ నిన్నే ప్రారంభమైంది. అయితే నిన్న ఈ టోర్నమెంట్ ప్రారంభం కాగా మొదటి మ్యాచ్ లోనే 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ (vaibhav suryavanshi) అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ చివరి క్షణంలో వైభవ్ అవకాశం రాలేదు. దీంతో ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందారు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు వైభవ్ కు మరో అవమానం కూడా జరిగింది. జాతీయగీతం పాడేటప్పుడు, వైభవ్ సూర్యవంశీ ముందు చిన్నపిల్లాడిని పెట్టలేదు. క్రికెటర్లు అందరి ముందు చిన్నపిల్లలను పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వైభవ్ ఇప్పటికీ స్కూల్ కి వెళ్లే కుర్రాడని భావించిన ఐసీసీ, అతని ముందు మాత్రం ఎలాంటి కుర్రాడిని పెట్టలేదు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు, ఐసిసి పై మండిపడుతున్నారు. అంతర్జాతీయ బౌలర్లను వేధిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇంకా మీ దృష్టిలో చిన్న పిల్లవాడేనా? వాడు ఎప్పుడో పెద్దవాడు అయ్యాడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా వైభవ్ ముందు అందరిలాగే చిన్నపిల్లలను పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs Team India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోన్న నేపథ్యంలో మొదటి మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాలేదు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో రెండో మ్యాచ్ లో వైభవ్ ను ఆడిస్తారని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే వైభవ్ కు సమాచారం అందినట్లు చెబుతున్నారు.